రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రామన్నపేట మండల కేంద్రంలోని ప్రధాన రహదారి విస్తరణకు హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా లక్ష్యాపురంలో జరుగుతున్న ఓ శుభకార్యానికి వెళ్తున్న సందర్భంగా మంత్రి రామన్నపేటలో కొద్దిసేపు ఆగారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గరిక సత్యనారాయణ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిని విస్తరించి అభివృద్ధి చేయాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో రహదారిని వెడల్పు చేసి ఆధునికీకరించాలని కోరారు.
సర్పంచ్ విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రహదారి సమస్యను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి సానుకూలంగా స్పందించడంపై సర్పంచ్ గరిక సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి