నల్లగొండ: పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆమంచి రాజలింగం తల్లి ఆమంచి బుచ్చమ్మ ఇటీవల మృతి చెందడంతో ఆమె ఇష్టబంతి కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు నిర్వహించారు. కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, నాయకులు, బీజేపీ కార్యకర్తలు, బంధుమిత్రులు హాజరై బుచ్చమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బండారు ప్రసాద్, పిల్లి రామరాజు తదితరులు కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. అనంతరం బంధుమిత్రులు, స్నేహితులు, రక్తసంబంధీకులకు భోజన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ ఆమంచి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి