భువనగిరి
జూన్ 2న నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు అధికారులను ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. జెండా ఆవిష్కరణ స్థలం, పరేడ్ గ్రౌండ్, సభా ప్రాంగణం, విద్యుత్, పారిశుధ్య సౌకర్యాలు తదితర ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
వేడుకలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని ఆదేశించారు.
పరిశీలన కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్రెడ్డి, కలెక్టరేట్ ఏవో అంజిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి