Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:07 AM

మనవడి కళ్లెదుటే తాత విషాద అంతం: బైక్ పక్కకు ఆపి స్పృహతప్పిన కార్పెంటర్

మనవడి కళ్లెదుటే తాత విషాద అంతం: బైక్ పక్కకు ఆపి స్పృహతప్పిన కార్పెంటర్

మనవడి కళ్లెదుటే తాత విషాద అంతం: బైక్ పక్కకు ఆపి స్పృహతప్పిన కార్పెంటర్
23-05-2026 474 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మండల పరిధిలోని లింగారెడ్డిగూడెం గ్రామ శివారులో శనివారం మధ్యాహ్నం వృద్ధుడు ఆకస్మికంగా కుప్పకూలి మృతి చెందాడు. మనవడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం మందోల్లగూడెం గ్రామానికి చెందిన దేవరకొండ శంకరయ్య (65) వృత్తిరీత్యా కార్పెంటర్. శనివారం మధ్యాహ్నం ఆయన తన వ్యక్తిగత పని నిమిత్తం మనుమడు మొకరోజు మణికంఠతో కలిసి బైక్ (TS 30 K 8907) పై చౌటుప్పల్ వచ్చారు. పని ముగించుకుని తిరిగి గ్రామానికి బయలుదేరారు.​మార్గమధ్యలో మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో లింగారెడ్డిగూడెం గ్రామ పరిధిలోని మార్లమైసమ్మ గుడి ఆర్చ్ సమీపానికి చేరుకోగానే, శంకరయ్యకు ఒక్కసారిగా కళ్ళు తిరగడం ప్రారంభమైంది. వెంటనే వెనుక కూర్చున్న మనవడికి "కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తోంది" అని చెబుతూ బైక్‌ను రోడ్డు పక్కకు ఆపారు. వాహనం ఆపిన కొద్దిసేపటికే ఆయన తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయారు.​కంగారుపడిన మనవడు స్థానికుల సహాయంతో వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. శంకరయ్యను అత్యవసరంగా చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మధ్యాహ్నం 2 గంటల సమయంలో పరీక్షించిన డ్యూటీ డాక్టర్.. ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు దేవరకొండ శ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ దర్యాప్తు ప్రారంభించారు.

Sthanikam

మనవడి కళ్లెదుటే తాత విషాద అంతం: బైక్ పక్కకు ఆపి స్పృహతప్పిన కార్పెంటర్

Article Image

చౌటుప్పల్ మండల పరిధిలోని లింగారెడ్డిగూడెం గ్రామ శివారులో శనివారం మధ్యాహ్నం వృద్ధుడు ఆకస్మికంగా కుప్పకూలి మృతి చెందాడు. మనవడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం మందోల్లగూడెం గ్రామానికి చెందిన దేవరకొండ శంకరయ్య (65) వృత్తిరీత్యా కార్పెంటర్. శనివారం మధ్యాహ్నం ఆయన తన వ్యక్తిగత పని నిమిత్తం మనుమడు మొకరోజు మణికంఠతో కలిసి బైక్ (TS 30 K 8907) పై చౌటుప్పల్ వచ్చారు. పని ముగించుకుని తిరిగి గ్రామానికి బయలుదేరారు.​మార్గమధ్యలో మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో లింగారెడ్డిగూడెం గ్రామ పరిధిలోని మార్లమైసమ్మ గుడి ఆర్చ్ సమీపానికి చేరుకోగానే, శంకరయ్యకు ఒక్కసారిగా కళ్ళు తిరగడం ప్రారంభమైంది. వెంటనే వెనుక కూర్చున్న మనవడికి "కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తోంది" అని చెబుతూ బైక్‌ను రోడ్డు పక్కకు ఆపారు. వాహనం ఆపిన కొద్దిసేపటికే ఆయన తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయారు.​కంగారుపడిన మనవడు స్థానికుల సహాయంతో వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. శంకరయ్యను అత్యవసరంగా చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మధ్యాహ్నం 2 గంటల సమయంలో పరీక్షించిన డ్యూటీ డాక్టర్.. ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు దేవరకొండ శ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ దర్యాప్తు ప్రారంభించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News