మనవడి కళ్లెదుటే తాత విషాద అంతం: బైక్ పక్కకు ఆపి స్పృహతప్పిన కార్పెంటర్
మనవడి కళ్లెదుటే తాత విషాద అంతం: బైక్ పక్కకు ఆపి స్పృహతప్పిన కార్పెంటర్
K.RAVI
చౌటుప్పల్ మండల పరిధిలోని లింగారెడ్డిగూడెం గ్రామ శివారులో శనివారం మధ్యాహ్నం వృద్ధుడు ఆకస్మికంగా కుప్పకూలి మృతి చెందాడు. మనవడితో కలిసి బైక్పై వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం మందోల్లగూడెం గ్రామానికి చెందిన దేవరకొండ శంకరయ్య (65) వృత్తిరీత్యా కార్పెంటర్. శనివారం మధ్యాహ్నం ఆయన తన వ్యక్తిగత పని నిమిత్తం మనుమడు మొకరోజు మణికంఠతో కలిసి బైక్ (TS 30 K 8907) పై చౌటుప్పల్ వచ్చారు. పని ముగించుకుని తిరిగి గ్రామానికి బయలుదేరారు.మార్గమధ్యలో మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో లింగారెడ్డిగూడెం గ్రామ పరిధిలోని మార్లమైసమ్మ గుడి ఆర్చ్ సమీపానికి చేరుకోగానే, శంకరయ్యకు ఒక్కసారిగా కళ్ళు తిరగడం ప్రారంభమైంది. వెంటనే వెనుక కూర్చున్న మనవడికి "కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తోంది" అని చెబుతూ బైక్ను రోడ్డు పక్కకు ఆపారు. వాహనం ఆపిన కొద్దిసేపటికే ఆయన తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయారు.కంగారుపడిన మనవడు స్థానికుల సహాయంతో వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. శంకరయ్యను అత్యవసరంగా చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మధ్యాహ్నం 2 గంటల సమయంలో పరీక్షించిన డ్యూటీ డాక్టర్.. ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు దేవరకొండ శ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ దర్యాప్తు ప్రారంభించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి