Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:11 PM

మనవడి కళ్లెదుటే తాత విషాద అంతం: బైక్ పక్కకు ఆపి స్పృహతప్పిన కార్పెంటర్

మనవడి కళ్లెదుటే తాత విషాద అంతం: బైక్ పక్కకు ఆపి స్పృహతప్పిన కార్పెంటర్

మనవడి కళ్లెదుటే తాత విషాద అంతం: బైక్ పక్కకు ఆపి స్పృహతప్పిన కార్పెంటర్
May 23, 2026 06:52 PM 467 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మండల పరిధిలోని లింగారెడ్డిగూడెం గ్రామ శివారులో శనివారం మధ్యాహ్నం వృద్ధుడు ఆకస్మికంగా కుప్పకూలి మృతి చెందాడు. మనవడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం మందోల్లగూడెం గ్రామానికి చెందిన దేవరకొండ శంకరయ్య (65) వృత్తిరీత్యా కార్పెంటర్. శనివారం మధ్యాహ్నం ఆయన తన వ్యక్తిగత పని నిమిత్తం మనుమడు మొకరోజు మణికంఠతో కలిసి బైక్ (TS 30 K 8907) పై చౌటుప్పల్ వచ్చారు. పని ముగించుకుని తిరిగి గ్రామానికి బయలుదేరారు.​మార్గమధ్యలో మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో లింగారెడ్డిగూడెం గ్రామ పరిధిలోని మార్లమైసమ్మ గుడి ఆర్చ్ సమీపానికి చేరుకోగానే, శంకరయ్యకు ఒక్కసారిగా కళ్ళు తిరగడం ప్రారంభమైంది. వెంటనే వెనుక కూర్చున్న మనవడికి "కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తోంది" అని చెబుతూ బైక్‌ను రోడ్డు పక్కకు ఆపారు. వాహనం ఆపిన కొద్దిసేపటికే ఆయన తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయారు.​కంగారుపడిన మనవడు స్థానికుల సహాయంతో వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. శంకరయ్యను అత్యవసరంగా చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మధ్యాహ్నం 2 గంటల సమయంలో పరీక్షించిన డ్యూటీ డాక్టర్.. ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు దేవరకొండ శ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ దర్యాప్తు ప్రారంభించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News