Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 09:46 PM

చౌటుప్పల్ మండలంలో విద్యాసంస్థల బంద్ సక్సెస్!

చౌటుప్పల్ మండలంలో విద్యాసంస్థల బంద్ సక్సెస్!

చౌటుప్పల్ మండలంలో విద్యాసంస్థల బంద్ సక్సెస్!
July 10, 2026 08:20 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తే సహించేది లేదు

రూ.10,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

ఎస్ఎఫ్ఐ, వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ, వామపక్ష విద్యార్థి సంఘాలు శుక్రవారం ఇచ్చిన విద్యాసంస్థల బంద్ చౌటుప్పల్ మండలంలో విజయవంతమైంది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు ఆసరా ప్రకాష్, కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.10,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

​ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించే ఆలోచనను విరమించుకోవాలని, విద్యాశాఖలో ఖాళీగా ఉన్న టీచర్, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. విద్యార్థులపై భారం మోపే జీవో నెం. 7, 8, 9లను ఉపసంహరించుకోవాలన్నారు. కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. బంద్‌కు సహకరించిన విద్యాసంస్థల యాజమాన్యాలు,

తల్లిదండ్రులకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు దోనూరు శ్రావణ్, ఎరిగి వరుణ్ తేజ్, మండల నాయకులు మల్లేష్, మణికంఠ, సిద్దు, బన్నీ, జయంత్, అభి, మోసిన్, నవదీప్, నరసింహ, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News