Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:23 AM

చౌటుప్పల్ మండలంలో విద్యాసంస్థల బంద్ సక్సెస్!

చౌటుప్పల్ మండలంలో విద్యాసంస్థల బంద్ సక్సెస్!

చౌటుప్పల్ మండలంలో విద్యాసంస్థల బంద్ సక్సెస్!
10-07-2026 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తే సహించేది లేదు

రూ.10,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

ఎస్ఎఫ్ఐ, వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ, వామపక్ష విద్యార్థి సంఘాలు శుక్రవారం ఇచ్చిన విద్యాసంస్థల బంద్ చౌటుప్పల్ మండలంలో విజయవంతమైంది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు ఆసరా ప్రకాష్, కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.10,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

​ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించే ఆలోచనను విరమించుకోవాలని, విద్యాశాఖలో ఖాళీగా ఉన్న టీచర్, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. విద్యార్థులపై భారం మోపే జీవో నెం. 7, 8, 9లను ఉపసంహరించుకోవాలన్నారు. కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. బంద్‌కు సహకరించిన విద్యాసంస్థల యాజమాన్యాలు,

తల్లిదండ్రులకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు దోనూరు శ్రావణ్, ఎరిగి వరుణ్ తేజ్, మండల నాయకులు మల్లేష్, మణికంఠ, సిద్దు, బన్నీ, జయంత్, అభి, మోసిన్, నవదీప్, నరసింహ, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్ మండలంలో విద్యాసంస్థల బంద్ సక్సెస్!

Article Image

ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తే సహించేది లేదు

రూ.10,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

ఎస్ఎఫ్ఐ, వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ, వామపక్ష విద్యార్థి సంఘాలు శుక్రవారం ఇచ్చిన విద్యాసంస్థల బంద్ చౌటుప్పల్ మండలంలో విజయవంతమైంది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు ఆసరా ప్రకాష్, కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.10,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

​ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించే ఆలోచనను విరమించుకోవాలని, విద్యాశాఖలో ఖాళీగా ఉన్న టీచర్, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. విద్యార్థులపై భారం మోపే జీవో నెం. 7, 8, 9లను ఉపసంహరించుకోవాలన్నారు. కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. బంద్‌కు సహకరించిన విద్యాసంస్థల యాజమాన్యాలు,

తల్లిదండ్రులకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు దోనూరు శ్రావణ్, ఎరిగి వరుణ్ తేజ్, మండల నాయకులు మల్లేష్, మణికంఠ, సిద్దు, బన్నీ, జయంత్, అభి, మోసిన్, నవదీప్, నరసింహ, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News