చౌటుప్పల్ మండలంలో విద్యాసంస్థల బంద్ సక్సెస్!
చౌటుప్పల్ మండలంలో విద్యాసంస్థల బంద్ సక్సెస్!
K.RAVI
ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తే సహించేది లేదు
రూ.10,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
ఎస్ఎఫ్ఐ, వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ, వామపక్ష విద్యార్థి సంఘాలు శుక్రవారం ఇచ్చిన విద్యాసంస్థల బంద్ చౌటుప్పల్ మండలంలో విజయవంతమైంది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు ఆసరా ప్రకాష్, కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.10,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించే ఆలోచనను విరమించుకోవాలని, విద్యాశాఖలో ఖాళీగా ఉన్న టీచర్, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. విద్యార్థులపై భారం మోపే జీవో నెం. 7, 8, 9లను ఉపసంహరించుకోవాలన్నారు. కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. బంద్కు సహకరించిన విద్యాసంస్థల యాజమాన్యాలు,
తల్లిదండ్రులకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు దోనూరు శ్రావణ్, ఎరిగి వరుణ్ తేజ్, మండల నాయకులు మల్లేష్, మణికంఠ, సిద్దు, బన్నీ, జయంత్, అభి, మోసిన్, నవదీప్, నరసింహ, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి