Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:11 AM

పాడి గేదె మృతితో రైతు లింగస్వామికి తీరని నష్టం

పాడి గేదె మృతితో రైతు లింగస్వామికి తీరని నష్టం

పాడి గేదె మృతితో రైతు లింగస్వామికి తీరని నష్టం
10-07-2026 226 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, జూలై 10: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందిన రైతు నాలుగోని లింగస్వామికి చెందిన పాడి గేదె గురువారం విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కుటుంబానికి ఆదాయ వనరుగా ఉన్న గేదె ఒక్కసారిగా మృతి చెందడంతో రైతు ఆర్థికంగా దెబ్బతిన్నాడు.

స్థానికుల వివరాల ప్రకారం, మేత కోసం వెళ్లిన గేదె ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రవహిస్తున్న తీగలను తాకడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది. విషయం తెలుసుకున్న రైతు లింగస్వామి సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యాడు. పాడి పరిశ్రమపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న తనకు ఈ ఘటనతో తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోయాడు.

గ్రామస్తులు ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ బాధిత రైతుకు ప్రభుత్వం, సంబంధిత శాఖల అధికారులు తక్షణమే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

Sthanikam

పాడి గేదె మృతితో రైతు లింగస్వామికి తీరని నష్టం

Article Image

చిట్యాల, జూలై 10: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందిన రైతు నాలుగోని లింగస్వామికి చెందిన పాడి గేదె గురువారం విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కుటుంబానికి ఆదాయ వనరుగా ఉన్న గేదె ఒక్కసారిగా మృతి చెందడంతో రైతు ఆర్థికంగా దెబ్బతిన్నాడు.

స్థానికుల వివరాల ప్రకారం, మేత కోసం వెళ్లిన గేదె ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రవహిస్తున్న తీగలను తాకడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది. విషయం తెలుసుకున్న రైతు లింగస్వామి సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యాడు. పాడి పరిశ్రమపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న తనకు ఈ ఘటనతో తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోయాడు.

గ్రామస్తులు ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ బాధిత రైతుకు ప్రభుత్వం, సంబంధిత శాఖల అధికారులు తక్షణమే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News