చిట్యాల, ఆగస్టు 23: చిట్యాలపుర పట్టణంలోని 9వ వార్డులో ఇటీవల నూతనంగా ఎన్నికైన ఎంజీ యూత్ కమిటీ సభ్యులు నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశంను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం నూతన కమిటీ సభ్యులను శాలువాతో సత్కరించి అభినందించారు.
అనంతరం ఎమ్మెల్యే వేముల వీరేశంను యూత్ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు. యూత్ కమిటీ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో కౌన్సిలర్ ఏర్పుల పరమేశం, కోఆప్షన్ సభ్యులు, గౌరవ అధ్యక్షుడు బెల్లి సత్తయ్య, అధ్యక్షుడు కంభంపాటి మల్లేష్, ప్రధాన కార్యదర్శి కొంపెల్లి రవి, కోశాధికారి జడల మహేష్, ఎల్ల మల్లేశం, బిక్షం చంద్రశేఖర్, జంగయ్య, మల్లేష్, తిరుపతి రెడ్డి, బాలకృష్ణ, జి.రవి, బి.నరేష్, మహేందర్ రెడ్డి, బిక్షం, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి