రూ.339.59 కోట్లతో ఐదు రహదారుల పనులకు నేడు శంకుస్థాపన. రామన్నపేటకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రాక.
రూ.339.59 కోట్లతో ఐదు రహదారుల పనులకు నేడు శంకుస్థాపన. రామన్నపేటకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రాక.
Editor Desk
చిట్యాల–భువనగిరి ఆర్అండ్బీ శాఖ పరిధిలో రూ.339.59 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఐదు డబుల్లైన్ రహదారుల అభివృద్ధి పనులకు ఆదివారం రామన్నపేటలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న జగన్మోహన్ తెలిపారు.
ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. అలాగే నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి పాల్గొంటారని తెలిపారు.
మొత్తం 109.3 కిలోమీటర్ల మేర ఐదు రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పున్న జగన్మోహన్ పిలుపునిచ్చారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి