Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:00 AM

రూ.339.59 కోట్లతో ఐదు రహదారుల పనులకు నేడు శంకుస్థాపన. రామన్నపేటకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాక.

రూ.339.59 కోట్లతో ఐదు రహదారుల పనులకు నేడు శంకుస్థాపన. రామన్నపేటకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాక.

రూ.339.59 కోట్లతో ఐదు రహదారుల పనులకు నేడు శంకుస్థాపన.  రామన్నపేటకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాక.
10-07-2026 125 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల–భువనగిరి ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో రూ.339.59 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఐదు డబుల్‌లైన్ రహదారుల అభివృద్ధి పనులకు ఆదివారం రామన్నపేటలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న జగన్మోహన్ తెలిపారు.

ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. అలాగే నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు.

మొత్తం 109.3 కిలోమీటర్ల మేర ఐదు రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పున్న జగన్మోహన్ పిలుపునిచ్చారు.

Sthanikam

రూ.339.59 కోట్లతో ఐదు రహదారుల పనులకు నేడు శంకుస్థాపన. రామన్నపేటకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాక.

Article Image

చిట్యాల–భువనగిరి ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో రూ.339.59 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఐదు డబుల్‌లైన్ రహదారుల అభివృద్ధి పనులకు ఆదివారం రామన్నపేటలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న జగన్మోహన్ తెలిపారు.

ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. అలాగే నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు.

మొత్తం 109.3 కిలోమీటర్ల మేర ఐదు రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పున్న జగన్మోహన్ పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News