Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:18 AM

గుండ్రాంపల్లి కాల్వలో గుర్తుతెలియని మృతదేహం

గుండ్రాంపల్లి కాల్వలో గుర్తుతెలియని మృతదేహం

గుండ్రాంపల్లి కాల్వలో గుర్తుతెలియని మృతదేహం
28-06-2026 390 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కన ఉన్న కాల్వలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.ప్రాథమిక సమాచారం మేరకు, మృతుడు వృద్ధుడిగా భావిస్తున్నారు. గత మూడు రోజులుగా మతిస్థిమితం సరిగా లేని ఓ వృద్ధుడు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో కాల్వలో లభ్యమైన మృతదేహం అదే వృద్ధుడిదేనా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

ఘటనాస్థలంలో ఆధారాలను సేకరించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్‌లో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి గుర్తింపుతో పాటు మరణానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.

Sthanikam

గుండ్రాంపల్లి కాల్వలో గుర్తుతెలియని మృతదేహం

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కన ఉన్న కాల్వలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.ప్రాథమిక సమాచారం మేరకు, మృతుడు వృద్ధుడిగా భావిస్తున్నారు. గత మూడు రోజులుగా మతిస్థిమితం సరిగా లేని ఓ వృద్ధుడు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో కాల్వలో లభ్యమైన మృతదేహం అదే వృద్ధుడిదేనా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

ఘటనాస్థలంలో ఆధారాలను సేకరించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్‌లో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి గుర్తింపుతో పాటు మరణానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News