Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుండ్రాంపల్లి కాల్వలో గుర్తుతెలియని మృతదేహం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 28, 2026 07:31 PM

గుండ్రాంపల్లి కాల్వలో గుర్తుతెలియని మృతదేహం

గుండ్రాంపల్లి కాల్వలో గుర్తుతెలియని మృతదేహం

గుండ్రాంపల్లి కాల్వలో గుర్తుతెలియని మృతదేహం
June 28, 2026 06:03 PM 203 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కన ఉన్న కాల్వలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.ప్రాథమిక సమాచారం మేరకు, మృతుడు వృద్ధుడిగా భావిస్తున్నారు. గత మూడు రోజులుగా మతిస్థిమితం సరిగా లేని ఓ వృద్ధుడు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో కాల్వలో లభ్యమైన మృతదేహం అదే వృద్ధుడిదేనా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

ఘటనాస్థలంలో ఆధారాలను సేకరించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్‌లో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి గుర్తింపుతో పాటు మరణానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News