గుండ్రాంపల్లి కాల్వలో గుర్తుతెలియని మృతదేహం
గుండ్రాంపల్లి కాల్వలో గుర్తుతెలియని మృతదేహం
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కన ఉన్న కాల్వలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.ప్రాథమిక సమాచారం మేరకు, మృతుడు వృద్ధుడిగా భావిస్తున్నారు. గత మూడు రోజులుగా మతిస్థిమితం సరిగా లేని ఓ వృద్ధుడు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో కాల్వలో లభ్యమైన మృతదేహం అదే వృద్ధుడిదేనా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
ఘటనాస్థలంలో ఆధారాలను సేకరించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్లో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి గుర్తింపుతో పాటు మరణానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి