యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లోని నిదానపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఐదేళ్లలోపు వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, తల్లిదండ్రులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్త మాధవి తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి