మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం
మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం
Anjali
జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు శాఖ మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు నల్లమాడ మండలంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో భారీ మొత్తంలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కదిరి–బెంగళూరు జాతీయ రహదారిపై పులగంపల్లి క్రాస్ సమీపంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు AP39 SA 7507 నంబర్ గల హ్యుందాయ్ వేర్న కారును ఆపి పరిశీలించగా, డిక్కీలోని రెండు మూటలలో 24 ప్యాకెట్లలో సుమారు 53 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు.
ఈ కేసులో బి. వెంకట రమణ (25) ను అరెస్ట్ చేసి, గంజాయి, కారు, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు మల్లికార్జున పరారీలో ఉండగా, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
ఈ కేసు వివరాలను పుట్టపర్తి ఇన్ఛార్జ్ డీఎస్పీ శివన్నారాయణ స్వామి, నల్లమాడ సీఐ శ్రీనివాసులు తో కలిసి మీడియాకు వెల్లడించారు.మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు మరియు వినియోగంపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు కొనసాగుతాయి అని పోలీసులు హెచ్చరించారు. నేర నియంత్రణలో అప్రమత్తంగా పనిచేస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు శాఖకు అభినందనలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి