PRINT TIME: June 27, 2026 12:03 AM
40 దేశాలు చూశా.. కానీ భారత్లాంటి దేశం లేదు.I Love India' అంటూ జర్మన్ రచయిత మరియా విర్త్ వైరల్ వ్యాఖ్యలు
40 దేశాలు చూశా.. కానీ భారత్లాంటి దేశం లేదు.I Love India' అంటూ జర్మన్ రచయిత మరియా విర్త్ వైరల్ వ్యాఖ్యలు
June 26, 2026 06:03 PM
26 Views
స్థానికం ప్రతినిధి :
వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh
40 దేశాలు పర్యటించినా తన మనసును గెలుచుకున్నది ఒక్క భారతదేశమేనని జర్మన్ రచయిత మరియా విర్త్ పేర్కొన్నారు. భారత్పై ఆమె చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
'ప్రతి దేశంలో మంచి, చెడు వ్యక్తులు ఉంటారు. కానీ భారతదేశంలో ఎక్కువగా వివేకవంతులు, జ్ఞానవంతులు కనిపించారు. ఈ నేలలో అపూర్వమైన తత్వశాస్త్రం ఉంది. ఇక్కడ నాకు అపారమైన ప్రేమ, ఆప్యాయత లభించాయి. అందుకే నేను అత్యంత ఎక్కువగా ప్రేమించే దేశం ఇండియానే' అని మరియా విర్త్ తన పోస్టులో వెల్లడించారు.
ఆమె వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకుంటుండగా, వేలాది మంది వాటిని షేర్ చేస్తూ స్పందిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి