నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ :- సిపిఐ
నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ :- సిపిఐ
Anjali
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద శనివారం భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మరియు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బి. కదిరప్ప, సిపిఐ పట్టణ కార్యదర్శి ఇలియాత్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక విధానాల వల్ల సామాన్య ప్రజలు, వ్యవసాయ కార్మికులు, కూలీలు, మధ్యతరగతి కుటుంబాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
దేశంలో ఇప్పటికే నిరుద్యోగం, పేదరికం, ఉపాధి కొరత వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతూ ప్రజలపై అదనపు భారం మోపుతున్నాయని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావంతో రవాణా ఖర్చులు పెరిగి, కూరగాయలు, పప్పుధాన్యాలు, వంటనూనెలు, బియ్యం తదితర నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగాయని పేర్కొన్నారు.
రోజువారీ కూలి పనులు చేసుకుని జీవించే కార్మిక కుటుంబాలు రెండు పూటల భోజనం కూడా సమకూర్చుకోవడం కష్టంగా మారిందన్నారు. గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్య ప్రజలకు అందని ద్రాక్షలా మారాయని, విద్యుత్ ఛార్జీలు, విద్య, వైద్య ఖర్చులు కూడా పెరగడంతో ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు రాయితీలు కల్పిస్తూ పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలను విస్మరిస్తున్నాయని ఆరోపించారు. పెరుగుతున్న ధరలను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ సిపిఐ నాయకులు ఆదినారాయణ భాస్కర్ బషీర్ బాబావలి ఇలియాకత్ శంకర్ రజియా సోఫియా తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి