PRINT TIME: June 06, 2026 04:28 PM
ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య
ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య
April 22, 2026 11:01 AM
140 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఆంధ్రప్రదేశ్: నిశ్చితార్థం తర్వాత వరుడి నిరాకరణతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, పటేల్డు గ్రామానికి చెందిన రెహానా (26)కు ఇటీవల ప్రొద్దుటూరుకు చెందిన షాజహాన్తో నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచి వీరిద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. అయితే ‘నువ్వంటే ఇష్టం లేదు.. నిన్ను చూసి ఎలాంటి ఫీలింగ్స్ రావడం లేదు’ అంటూ యువకుడు పలుమార్లు చెప్పినట్లు సమాచారం.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రెహానా సోమవారం ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి