Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:34 AM

మాకు న్యాయం చేయండి మహాప్రభు- వాటర్ ప్లాంట్ కార్మికులు

మాకు న్యాయం చేయండి మహాప్రభు- వాటర్ ప్లాంట్ కార్మికులు

మాకు న్యాయం చేయండి మహాప్రభు- వాటర్ ప్లాంట్ కార్మికులు
19-05-2026 152 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో 15వ రోజు నిరసన కార్యక్రమంలో భాగంగా ఎర్రటి ఎండలో పొర్లు దండాలు పెడుతూ మా మొర ఆలకించండి మహాప్రభో పెండింగ్ జీతాలు చెల్లించండి అంటూ వినూత్న పద్ధతిలో నిరసన తెలియజేశారు. ఐదు నెలలగా మా కడుపులో మాడుతున్నాయి.. ఇప్పుడు మండు టెండలో మా బాధలు చూసైనా కనికరించండి అంటూ వేడుకున్నారు. సంక్షేమ పథకాలకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం గ్రామ గ్రామానికి నీరు అందిస్తున్న మా సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు చిన్నచూపు చూస్తోందో అర్థం కావడం లేదన్నారు. ఐదు నెలలుగా జీతాలు అందకపోవడంతో మా కుటుంబాలు పస్తులు ఉంటున్నాయని చేసిన అప్పులు తీర్చుకోలేక సతమతమవుతున్నామని వాపోయారు. బోర్డు ఆధీనంలోనే సత్యసాయి తాగునీటి పథకం కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించినప్పటికీ ఆయన ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా మా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో చలో అమరావతి కార్యక్రమం చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.

Sthanikam

మాకు న్యాయం చేయండి మహాప్రభు- వాటర్ ప్లాంట్ కార్మికులు

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో 15వ రోజు నిరసన కార్యక్రమంలో భాగంగా ఎర్రటి ఎండలో పొర్లు దండాలు పెడుతూ మా మొర ఆలకించండి మహాప్రభో పెండింగ్ జీతాలు చెల్లించండి అంటూ వినూత్న పద్ధతిలో నిరసన తెలియజేశారు. ఐదు నెలలగా మా కడుపులో మాడుతున్నాయి.. ఇప్పుడు మండు టెండలో మా బాధలు చూసైనా కనికరించండి అంటూ వేడుకున్నారు. సంక్షేమ పథకాలకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం గ్రామ గ్రామానికి నీరు అందిస్తున్న మా సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు చిన్నచూపు చూస్తోందో అర్థం కావడం లేదన్నారు. ఐదు నెలలుగా జీతాలు అందకపోవడంతో మా కుటుంబాలు పస్తులు ఉంటున్నాయని చేసిన అప్పులు తీర్చుకోలేక సతమతమవుతున్నామని వాపోయారు. బోర్డు ఆధీనంలోనే సత్యసాయి తాగునీటి పథకం కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించినప్పటికీ ఆయన ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా మా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో చలో అమరావతి కార్యక్రమం చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News