మాకు న్యాయం చేయండి మహాప్రభు- వాటర్ ప్లాంట్ కార్మికులు
మాకు న్యాయం చేయండి మహాప్రభు- వాటర్ ప్లాంట్ కార్మికులు
Anjali
శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో 15వ రోజు నిరసన కార్యక్రమంలో భాగంగా ఎర్రటి ఎండలో పొర్లు దండాలు పెడుతూ మా మొర ఆలకించండి మహాప్రభో పెండింగ్ జీతాలు చెల్లించండి అంటూ వినూత్న పద్ధతిలో నిరసన తెలియజేశారు. ఐదు నెలలగా మా కడుపులో మాడుతున్నాయి.. ఇప్పుడు మండు టెండలో మా బాధలు చూసైనా కనికరించండి అంటూ వేడుకున్నారు. సంక్షేమ పథకాలకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం గ్రామ గ్రామానికి నీరు అందిస్తున్న మా సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు చిన్నచూపు చూస్తోందో అర్థం కావడం లేదన్నారు. ఐదు నెలలుగా జీతాలు అందకపోవడంతో మా కుటుంబాలు పస్తులు ఉంటున్నాయని చేసిన అప్పులు తీర్చుకోలేక సతమతమవుతున్నామని వాపోయారు. బోర్డు ఆధీనంలోనే సత్యసాయి తాగునీటి పథకం కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించినప్పటికీ ఆయన ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా మా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో చలో అమరావతి కార్యక్రమం చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి