PRINT TIME: April 13, 2026 10:28 AM
సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష
సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష
April 13, 2026 08:54 AM
1 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
జనాభా లెక్కలు (సెన్సస్-2027) ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అనంతరం మే 1వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో గణన కార్యక్రమం ప్రారంభం కానుంది.జనాభా లెక్కల కోసం అధికారులు ఇళ్లకు వచ్చినప్పుడు గృహ యజమానులు తప్పనిసరిగా అనుమతించాలని ప్రభుత్వం సూచించింది. అధికారులు అడిగే ప్రశ్నలకు స్పష్టంగా సమాధానాలు ఇవ్వాల్సిందిగా తెలియజేసింది.నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. ఇదే నిబంధనలు అధికారులకూ వర్తిస్తాయని స్పష్టం చేసింది.జనాభా లెక్కలు సమగ్రంగా, ఖచ్చితంగా నిర్వహించేందుకు ప్రజల సహకారం అత్యవసరమని అధికారులు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి