Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:32 AM

డయల్ యువర్ డీఎం'కు భారీ స్పందన.

డయల్ యువర్ డీఎం'కు భారీ స్పందన.

డయల్ యువర్ డీఎం'కు భారీ స్పందన.
15-07-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

బస్సుల సమస్యలపై ప్రయాణికుల వెల్లువ...

పరిష్కారానికి డిపో మేనేజర్ హామీ.

అదనపు బస్సుల కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తాం – డీఎం వేణుగోపాల్.

స్థానికం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో నిర్వహించిన 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమానికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ విషయాన్ని డిపో మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. వివిధ పత్రికల్లో ప్రచురితమైన కథనాల నేపథ్యంలో సుమారు 35 మంది ప్రయాణికులు ఫోన్ ద్వారా తమ సమస్యలను నేరుగా డిపో యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు.

ప్రధానంగా ఉదయం, సాయంత్రం పాఠశాలలు, కళాశాలల సమయాల్లో అదనపు బస్సులు నడపాలని, అలాగే 3KN రూట్‌లో బస్సుల సంఖ్య తక్కువగా ఉండటంతో మరిన్ని సర్వీసులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా, సీనియర్ సిటిజన్‌ల కోసం కేటాయించిన సీట్లలో ఇతరులు కూర్చొని లేవడం లేదని, వృద్ధులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిర్యాదు చేశారు. సీనియర్ సిటిజన్‌ల కోసం మరిన్ని సీట్లు కేటాయించాలని కూడా కోరారు.

ఈ సందర్భంగా డిపో మేనేజర్ వేణుగోపాల్ మాట్లాడుతూ, ప్రయాణికులు సూచించిన సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, అదనపు బస్సుల అవసరాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

అలాగే, పెళ్లిళ్లు, విహారయాత్రలు, శుభకార్యాల కోసం అద్దె ప్రాతిపదికన తక్కువ ధరల్లో ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Sthanikam

డయల్ యువర్ డీఎం'కు భారీ స్పందన.

Article Image

బస్సుల సమస్యలపై ప్రయాణికుల వెల్లువ...

పరిష్కారానికి డిపో మేనేజర్ హామీ.

అదనపు బస్సుల కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తాం – డీఎం వేణుగోపాల్.

స్థానికం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో నిర్వహించిన 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమానికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ విషయాన్ని డిపో మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. వివిధ పత్రికల్లో ప్రచురితమైన కథనాల నేపథ్యంలో సుమారు 35 మంది ప్రయాణికులు ఫోన్ ద్వారా తమ సమస్యలను నేరుగా డిపో యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు.

ప్రధానంగా ఉదయం, సాయంత్రం పాఠశాలలు, కళాశాలల సమయాల్లో అదనపు బస్సులు నడపాలని, అలాగే 3KN రూట్‌లో బస్సుల సంఖ్య తక్కువగా ఉండటంతో మరిన్ని సర్వీసులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా, సీనియర్ సిటిజన్‌ల కోసం కేటాయించిన సీట్లలో ఇతరులు కూర్చొని లేవడం లేదని, వృద్ధులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిర్యాదు చేశారు. సీనియర్ సిటిజన్‌ల కోసం మరిన్ని సీట్లు కేటాయించాలని కూడా కోరారు.

ఈ సందర్భంగా డిపో మేనేజర్ వేణుగోపాల్ మాట్లాడుతూ, ప్రయాణికులు సూచించిన సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, అదనపు బస్సుల అవసరాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

అలాగే, పెళ్లిళ్లు, విహారయాత్రలు, శుభకార్యాల కోసం అద్దె ప్రాతిపదికన తక్కువ ధరల్లో ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News