Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హామీలు కాదు.. డీఎస్సీ కావాలి..! సోమాజిగూడలో అభ్యర్థుల నిరసన రి-సర్వే పనులు వేగవంతంగా పూర్తి చేయాలి: డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 15, 2026 10:38 AM

ఓటర్లందరూ 'ఎస్‌ఐఆర్'లో దరఖాస్తు చేసుకోవాలి: డా. బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్

ఓటర్లందరూ 'ఎస్‌ఐఆర్'లో దరఖాస్తు చేసుకోవాలి: డా. బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్

ఓటర్లందరూ 'ఎస్‌ఐఆర్'లో దరఖాస్తు చేసుకోవాలి: డా. బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్
July 15, 2026 06:12 AM 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ,

ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటే పునాది అని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ప్రస్తుతం ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డా. బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ పిలుపునిచ్చారు.


ఎంజీయూలో రౌండ్ టేబుల్ సమావేశం

సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం యూనివర్సిటీ సెమినార్ హాల్‌లో నిర్వహించిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.


పారదర్శక ఎన్నికలకే సమగ్ర సవరణ

కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ చేపట్టిందని తెలిపారు. 2002 తర్వాత మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. ఎన్నికల పారదర్శకతను పెంచడం, తప్పుల్లేని ఓటరు జాబితా రూపొందించడమే దీని ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.


18 ఏళ్లు నిండితే.. ఓటరుగా నమోదు తప్పనిసరి


18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, ఇప్పటికే ఓటరు జాబితాలో ఉన్నవారు బీఎల్‌వోలు అందజేసిన దరఖాస్తులను పూరించి ఇవ్వాలని సూచించారు. చదువుకున్న వారు ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.


చనిపోయిన వారి పేర్ల తొలగింపు.. సందేహాలకు బీఎల్‌వోలే ఆధారం

సమగ్ర సవరణలో భాగంగా మరణించిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తారని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కృషి చేస్తోందని, ఓటర్లుగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. సందేహాలుంటే సంబంధిత బీఎల్‌వోలను సంప్రదించాలని సూచించారు.

సవరణ గడువు పొడిగించాలని విజ్ఞప్తి

ప్రజలకు మరింత అవకాశం కల్పించేలా ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ గడువును ఎన్నికల కమిషన్ పొడిగించాలని డా. కేశవులు ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు.


సమావేశంలో పాల్గొన్నవారు

డా. వెంకటరమణారెడ్డి, డా. ఎల్. మధు, డా. శ్రీదేవి, డా. మ్యాచెండర్, పిట్టల శంకర్, కాసుల అజయ్ కుమార్, భోనగిరి సంతోష్ కుమార్, కరింగు వెంకన్న, డా. జి. నరసింహ, డా. సన్వేర్, డా. అనితా కుమారి, డా. సతిరెడ్డి, డా. శ్రీనివాస్, డా. షరీఫ్, డా. రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News