Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ఇందిరా పార్క్ మహాధర్నాను జయప్రదం చేయండి: సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 14, 2026 07:52 PM

దళితులపై కుల వివక్షను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం

దళితులపై కుల వివక్షను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం

దళితులపై కుల వివక్షను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం
July 14, 2026 06:29 PM 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సామాజిక అణచివేతపై తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆగ్రహం

ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్

దేశంలో నేటికీ దళితులపై కుల వివక్ష, సామాజిక అణచివేత, దాడులు కొనసాగుతుండడం అత్యంత ఆందోళనకరమని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు అన్నారు. దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిగా అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన విమర్శించారు.​మంగళవారం చౌటుప్పల్‌లో నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో దళితులు భూహక్కులు, ఉపాధి, గృహాలు, తాగునీరు, రహదారులు వంటి మౌలిక వసతుల విషయంలో ఇప్పటికీ తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ, బాధితులకు తక్షణ న్యాయం అందించాలి.​దళితుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, గతంలో వారికి ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వాలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు యాట బాలరాజు, కార్యదర్శి చింతల సుదర్శన్, జిల్లా కమిటీ సభ్యులు బోయ యాదయ్య, మానే సాలయ్య, మండల నాయకులు యాట ముత్యాలు, పొట్ట వెంకటయ్య, నేరేడు మహేష్, జంగం అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News