దళితులపై కుల వివక్షను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం
దళితులపై కుల వివక్షను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం
K.RAVI
సామాజిక అణచివేతపై తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆగ్రహం
ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్
దేశంలో నేటికీ దళితులపై కుల వివక్ష, సామాజిక అణచివేత, దాడులు కొనసాగుతుండడం అత్యంత ఆందోళనకరమని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు అన్నారు. దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిగా అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన విమర్శించారు.మంగళవారం చౌటుప్పల్లో నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో దళితులు భూహక్కులు, ఉపాధి, గృహాలు, తాగునీరు, రహదారులు వంటి మౌలిక వసతుల విషయంలో ఇప్పటికీ తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ, బాధితులకు తక్షణ న్యాయం అందించాలి.దళితుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, గతంలో వారికి ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వాలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు యాట బాలరాజు, కార్యదర్శి చింతల సుదర్శన్, జిల్లా కమిటీ సభ్యులు బోయ యాదయ్య, మానే సాలయ్య, మండల నాయకులు యాట ముత్యాలు, పొట్ట వెంకటయ్య, నేరేడు మహేష్, జంగం అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి