Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాముకాటు బాధిత నిరుపేద యువకుడికి అండగా గొప్ప లింగా రెడ్డి నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 14, 2026 08:23 PM

ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణ. ఓటరు వివరాలు సక్రమంగా నమోదు చేసుకోవాలని సూచన

ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణ. ఓటరు వివరాలు సక్రమంగా నమోదు చేసుకోవాలని సూచన

ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణ.  ఓటరు వివరాలు సక్రమంగా నమోదు చేసుకోవాలని సూచన
July 14, 2026 07:02 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని హరిజనవాడ కాలనీలో ఎన్నికల ఎన్యుమరేషన్ ప్రక్రియలో భాగంగా కాలనీవాసులు తమ ఎన్యుమరేషన్ ఫారాలను సంబంధిత అధికారులకు మంగళవారం సమర్పించారు.

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజలు నింపిన ఎన్యుమరేషన్ ఫారాలను ఎన్నికల శాఖ సీనియర్ అసిస్టెంట్ రమావత్ వినీతాబాయి, బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ) మేడి లలితకు అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రతి ఓటరు తమ వివరాలు ఓటర్ల జాబితాలో సక్రమంగా నమోదయ్యేలా ఎన్యుమరేషన్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను పరిశీలించుకుని అవసరమైన మార్పులు, చేర్పులు చేయించుకోవాలని కోరారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బొడ్డు సాలయ్య, సురేందర్ రావు, గ్రామపంచాయతీ బిల్ కలెక్టర్ నకిరేకంటి రాములు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News