స్నేహానికి 50 ఏళ్లు.. సహచరులతో ఆత్మీయంగా గడిపిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్
స్నేహానికి 50 ఏళ్లు.. సహచరులతో ఆత్మీయంగా గడిపిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్
Krishna
సంగారెడ్డి జిల్లా సదాశివపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1975–76 పదో తరగతి విద్యార్థుల గోల్డెన్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం మల్కాపూర్ శివారులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని తన చిన్ననాటి సహచరులు, గురువులతో ఆప్యాయంగా కలుసుకున్నారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరిన మిత్రులు ఒకరినొకరు కౌగిలించుకుని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్ననాటి కష్టాలు, 2009లో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎదురైన ఇబ్బందులు, అవమానాలను గుర్తు చేసుకున్నారు. ప్రజల ప్రేమ, ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచానని, ప్రజాప్రతినిధిగా ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడకుండా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేశానని తెలిపారు. తన రాజకీయ ప్రయాణంలో భార్య సహకారం ఎంతో కీలకమైందని, ఆమె అండతోనే ప్రజాసేవలో ముందుకు సాగగలిగానని చెప్పారు. అలాగే తన సహపాఠుల్లో ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పూర్వ విద్యార్థులు తమ గురువులను సన్మానించి ఆశీర్వాదాలు తీసుకోగా, అందరూ కలిసి జ్ఞాపికలు పంచుకుని ఫొటోలు దిగుతూ ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని చిరస్మరణీయంగా మార్చుకున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి