చర్లపల్లి చేనేత సంఘం పాలకవర్గం ప్రమాణస్వీకారం
చర్లపల్లి చేనేత సంఘం పాలకవర్గం ప్రమాణస్వీకారం
Editor Desk
చర్లపల్లి చేనేత సహకార సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన నూతన పాలకవర్గం ఆదివారం సంఘ కార్యాలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేసింది. నూతనంగా ఎన్నికైన చైర్మన్ ముషం రవి, వైస్ చైర్మన్ రమేష్ ఈశ్వరయ్య, కార్యదర్శి రమేష్ బక్కయ్య, కోశాధికారి శేషమ్మ, సభ్యులు రమేష్ తదితరులు తమ పదవుల బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా నూతన పాలకవర్గం మాట్లాడుతూ, చేనేత కార్మికుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆర్థిక ప్రయోజనాలు ప్రతి చేనేత కార్మికుడికి సకాలంలో అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంఘ అభివృద్ధితో పాటు సభ్యుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ పారదర్శకంగా పనిచేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాపోలు శ్రీనివాసులు, రాపోలు శంకర్, వేణుబాబు, గుర్రం నరేందర్, గంజి రమేష్, గంజి పండరి, సీహెచ్ కిరణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి