PRINT TIME: July 12, 2026 07:43 PM
రామన్నపేట ఎస్సైగా సతీష్ గోపాటి బాధ్యతల స్వీకరణ. శాలువాతో సన్మానించిన పీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం యాదగిరి
రామన్నపేట ఎస్సైగా సతీష్ గోపాటి బాధ్యతల స్వీకరణ. శాలువాతో సన్మానించిన పీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం యాదగిరి
July 12, 2026 06:38 PM
18 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట పోలీస్ స్టేషన్కు నూతనంగా ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సతీష్ గోపాటిని ఆదివారం పీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం యాదగిరి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గడ్డం యాదగిరి మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రజల సమస్యల పట్ల నిస్వార్థంగా, నిజాయితీగా స్పందిస్తూ వారికి న్యాయం జరిగేలా సేవలందించాలని ఆకాంక్షించారు.
ఎస్సై సతీష్ గోపాటి మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యలను చట్టబద్ధంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా పరిశీలించి, చట్టపరంగా న్యాయం చేయడానికి పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గుండాల యాదయ్య పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి