Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి ఆధార్ పార్టీ; పార్టీ వ్యవస్థాపకులు ఈడ శేషగిరి రావు గౌడ్ నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 05, 2026 09:24 PM

మునుగోడులో కంటి సమస్యల్లేని నియోజకవర్గమే లక్ష్యం: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

మునుగోడులో కంటి సమస్యల్లేని నియోజకవర్గమే లక్ష్యం: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

మునుగోడులో కంటి సమస్యల్లేని నియోజకవర్గమే లక్ష్యం: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
July 05, 2026 07:44 PM 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 15వ ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభం

ఇప్పటివరకు 2,325 మందికి విజయవంతంగా ఉచిత ఆపరేషన్లు

మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడొద్దని, ప్రతి ఒక్కరికీ ఉచితంగా వైద్యం చేయించే బాధ్యత నాదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం చౌటుప్పల్‌లో 'కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్', ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన 15వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో 10,000 మందికి కంటి శస్త్రచికిత్సలు చేయించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించామని, ఈ శిబిరాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయని తెలిపారు. "మీకు నేనున్నా.. ధైర్యంగా వెళ్లి ఆపరేషన్ చేయించుకోండి" అని లబ్ధిదారులకు ఆత్మీయ భరోసా ఇచ్చారు.​రూపాయి ఖర్చు లేకుండా..గత 14 విడతల్లో మొత్తం 10,444 మందికి కంటి పరీక్షలు చేసి, 4,557 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశామని, 2,325 మందికి విజయవంతంగా ఆపరేషన్లు పూర్తి చేయించామని ఆయన వివరించారు. ఈరోజు జరిగిన 15వ విడత శిబిరంలో 1,210 మందికి పరీక్షలు నిర్వహించగా, 208 మందికి పైగా ఆపరేషన్లకు ఎంపికయ్యారు. వీరందరికీ ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News