కడిమెట్లలో ఘనంగా ముగిసిన టీటీడీ ధార్మిక కార్యక్రమాలు
కడిమెట్లలో ఘనంగా ముగిసిన టీటీడీ ధార్మిక కార్యక్రమాలు
Editor Desk
ఎమ్మిగనూరు, జులై 4: ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలోని శివాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా నిర్వహించిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు శనివారం గోపూజ, కుంకుమార్చనతో ఘనంగా ముగిశాయి.
కార్యక్రమాల్లో భాగంగా శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై డమాం జగదీశ్ ధార్మిక ప్రవచనాలు నిర్వహించగా, స్థానిక భజన మండలి భక్తి గీతాలతో భక్తులను అలరించింది. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగానే ఈ కార్యక్రమాలను నిర్వహించినట్లు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో పురోహితులు కడిమెట్ల ఈరన్నరావు, వేదపండితులు కె. శివమణి, కె. శంకరని, కె. దినేశ్, భజన మండలి సభ్యులు కంసాలి మోహన్, కె. భూషణరావు, బోయ శంకరప్ప, బోయ కేశన్న, లక్ష్మీకాంత్, బోయ నరసప్ప, బి. కిరణ్, బోయ నాయుడు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి