Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రైతులకు ఉచితంగా పత్తి విత్తనాల పంపిణీ ఎస్ ఐ ఆర్ ప్రక్రియను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 04, 2026 10:33 PM

కడిమెట్లలో ఘనంగా ముగిసిన టీటీడీ ధార్మిక కార్యక్రమాలు

కడిమెట్లలో ఘనంగా ముగిసిన టీటీడీ ధార్మిక కార్యక్రమాలు

కడిమెట్లలో ఘనంగా ముగిసిన టీటీడీ ధార్మిక కార్యక్రమాలు
July 04, 2026 08:43 PM 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎమ్మిగనూరు, జులై 4: ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలోని శివాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా నిర్వహించిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు శనివారం గోపూజ, కుంకుమార్చనతో ఘనంగా ముగిశాయి.

కార్యక్రమాల్లో భాగంగా శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై డమాం జగదీశ్ ధార్మిక ప్రవచనాలు నిర్వహించగా, స్థానిక భజన మండలి భక్తి గీతాలతో భక్తులను అలరించింది. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగానే ఈ కార్యక్రమాలను నిర్వహించినట్లు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పురోహితులు కడిమెట్ల ఈరన్నరావు, వేదపండితులు కె. శివమణి, కె. శంకరని, కె. దినేశ్, భజన మండలి సభ్యులు కంసాలి మోహన్, కె. భూషణరావు, బోయ శంకరప్ప, బోయ కేశన్న, లక్ష్మీకాంత్, బోయ నరసప్ప, బి. కిరణ్, బోయ నాయుడు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News