ఉరుమడ్లలో ఘనంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహణ
చిట్యాల, జూలై 4:
చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఐతరాజు నరసింహ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య రైతుల హక్కుల కోసం చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధన దిశగా కృషి చేస్తూ రైతు సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని తెలిపారు.
కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు వేముల బిక్షం, పల్లపు రామకృష్ణ, పల్లపు రాములు, కొయడి సత్యనారాయణ, వరికుప్పల విష్ణు, రూపని అంజయ్య, ఉయ్యాల సత్తమ్మ, రావుల లలిత తదితరులు పాల్గొని దొడ్డి కొమరయ్యకు ఘన నివాళులర్పించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి