Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:04 AM

దొడ్డి కొమరయ్య ఆశయాల సాధనకు కృషి చేస్తాం

దొడ్డి కొమరయ్య ఆశయాల సాధనకు కృషి చేస్తాం

దొడ్డి కొమరయ్య ఆశయాల సాధనకు కృషి చేస్తాం
04-07-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఉరుమడ్లలో ఘనంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహణ


చిట్యాల, జూలై 4:

చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఐతరాజు నరసింహ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య రైతుల హక్కుల కోసం చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధన దిశగా కృషి చేస్తూ రైతు సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని తెలిపారు.

కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు వేముల బిక్షం, పల్లపు రామకృష్ణ, పల్లపు రాములు, కొయడి సత్యనారాయణ, వరికుప్పల విష్ణు, రూపని అంజయ్య, ఉయ్యాల సత్తమ్మ, రావుల లలిత తదితరులు పాల్గొని దొడ్డి కొమరయ్యకు ఘన నివాళులర్పించారు.


Sthanikam

దొడ్డి కొమరయ్య ఆశయాల సాధనకు కృషి చేస్తాం

Article Image

ఉరుమడ్లలో ఘనంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహణ


చిట్యాల, జూలై 4:

చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఐతరాజు నరసింహ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య రైతుల హక్కుల కోసం చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధన దిశగా కృషి చేస్తూ రైతు సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని తెలిపారు.

కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు వేముల బిక్షం, పల్లపు రామకృష్ణ, పల్లపు రాములు, కొయడి సత్యనారాయణ, వరికుప్పల విష్ణు, రూపని అంజయ్య, ఉయ్యాల సత్తమ్మ, రావుల లలిత తదితరులు పాల్గొని దొడ్డి కొమరయ్యకు ఘన నివాళులర్పించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News