విద్యార్థుల అభివృద్ధే దేశ ప్రగతికి పునాది.. స్కూల్ బ్యాగ్ కిట్లు పంపిణీ చేసిన నెట్ డాటా సంస్థ
విద్యార్థుల అభివృద్ధే దేశ ప్రగతికి పునాది.. స్కూల్ బ్యాగ్ కిట్లు పంపిణీ చేసిన నెట్ డాటా సంస్థ
Krishna
విద్యార్థులే దేశ భవిష్యత్తుకు బలమైన పునాది అని, ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించి దేశాభివృద్ధిలో భాగస్వామి కావాలని నెట్ డాటా సంస్థ డైరెక్టర్ తిప్పరాజు ప్రసాద్ అన్నారు. శనివారం నారాయణఖేడ్ మండలం సంజీవన్రావుపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెట్ డాటా సంస్థ, యూత్ ఫర్ సేవా సభ్యుడు చంద్రశేఖర ఆచార్య సౌజన్యంతో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేయాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా ముందుకు సాగాలని సూచించారు. నెట్ డాటా సంస్థ గత పది సంవత్సరాలుగా విద్యార్థులకు విద్యా సామగ్రి, ల్యాప్టాప్లు, వీల్చైర్లు అందించడంతో పాటు ప్రతి నెల రెండు నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తోందని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు మరిన్ని సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచులు జ్యోతి భూపాల్, శ్రీకాంత్, జకరయ్య, ప్రధానోపాధ్యాయులు మహేశ్వరరావు, సాఫ్ట్వేర్ సంస్థ ప్రతినిధులు గీత గోసంగి, అమిత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి