Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:35 AM

విద్యార్థుల అభివృద్ధే దేశ ప్రగతికి పునాది.. స్కూల్ బ్యాగ్ కిట్లు పంపిణీ చేసిన నెట్ డాటా సంస్థ

విద్యార్థుల అభివృద్ధే దేశ ప్రగతికి పునాది.. స్కూల్ బ్యాగ్ కిట్లు పంపిణీ చేసిన నెట్ డాటా సంస్థ

విద్యార్థుల అభివృద్ధే దేశ ప్రగతికి పునాది.. స్కూల్ బ్యాగ్ కిట్లు పంపిణీ చేసిన నెట్ డాటా సంస్థ
04-07-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

విద్యార్థులే దేశ భవిష్యత్తుకు బలమైన పునాది అని, ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించి దేశాభివృద్ధిలో భాగస్వామి కావాలని నెట్ డాటా సంస్థ డైరెక్టర్ తిప్పరాజు ప్రసాద్ అన్నారు. శనివారం నారాయణఖేడ్ మండలం సంజీవన్‌రావుపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెట్ డాటా సంస్థ, యూత్ ఫర్ సేవా సభ్యుడు చంద్రశేఖర ఆచార్య సౌజన్యంతో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేయాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా ముందుకు సాగాలని సూచించారు. నెట్ డాటా సంస్థ గత పది సంవత్సరాలుగా విద్యార్థులకు విద్యా సామగ్రి, ల్యాప్‌టాప్‌లు, వీల్‌చైర్లు అందించడంతో పాటు ప్రతి నెల రెండు నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తోందని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు మరిన్ని సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచులు జ్యోతి భూపాల్, శ్రీకాంత్, జకరయ్య, ప్రధానోపాధ్యాయులు మహేశ్వరరావు, సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రతినిధులు గీత గోసంగి, అమిత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల అభివృద్ధే దేశ ప్రగతికి పునాది.. స్కూల్ బ్యాగ్ కిట్లు పంపిణీ చేసిన నెట్ డాటా సంస్థ

Article Image

విద్యార్థులే దేశ భవిష్యత్తుకు బలమైన పునాది అని, ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించి దేశాభివృద్ధిలో భాగస్వామి కావాలని నెట్ డాటా సంస్థ డైరెక్టర్ తిప్పరాజు ప్రసాద్ అన్నారు. శనివారం నారాయణఖేడ్ మండలం సంజీవన్‌రావుపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెట్ డాటా సంస్థ, యూత్ ఫర్ సేవా సభ్యుడు చంద్రశేఖర ఆచార్య సౌజన్యంతో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేయాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా ముందుకు సాగాలని సూచించారు. నెట్ డాటా సంస్థ గత పది సంవత్సరాలుగా విద్యార్థులకు విద్యా సామగ్రి, ల్యాప్‌టాప్‌లు, వీల్‌చైర్లు అందించడంతో పాటు ప్రతి నెల రెండు నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తోందని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు మరిన్ని సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచులు జ్యోతి భూపాల్, శ్రీకాంత్, జకరయ్య, ప్రధానోపాధ్యాయులు మహేశ్వరరావు, సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రతినిధులు గీత గోసంగి, అమిత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News