ప్రకృతిని కాపాడుకుందాం.. మనుగడను చాటుకుందాం!
ప్రకృతిని కాపాడుకుందాం.. మనుగడను చాటుకుందాం!
K.RAVI
విశాలభారతి పాఠశాలలో ఘనంగా వనమహోత్సవం
మొక్కలు నాటిన కౌన్సిలర్ పాక చిరంజీవి, కరస్పాండెంట్ చైతన్య క్రాంతి వర్ధన్ రెడ్డి
ప్రకృతిని కాపాడితేనే మానవ మనుగడ సాధ్యమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి పిలుపునిచ్చారు. శనివారం చౌటుప్పల్ కేంద్రంలోని ‘విశాలభారతి హైస్కూల్’లో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, పాఠశాల కరస్పాండెంట్ వీసం చైతన్య క్రాంతి వర్ధన్ రెడ్డితో కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ చిరంజీవి మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థి దశ నుంచే మొక్కల పెంపకంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పాఠశాల కరస్పాండెంట్ చైతన్య క్రాంతి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. తమ పాఠశాల తరఫున పర్యావరణ హిత కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ అశోక్ కుమార్, ప్రధానోపాధ్యాయులు ముత్యం శ్రీనివాస్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి