Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:23 AM

ప్రకృతిని కాపాడుకుందాం.. మనుగడను చాటుకుందాం!

ప్రకృతిని కాపాడుకుందాం.. మనుగడను చాటుకుందాం!

ప్రకృతిని కాపాడుకుందాం.. మనుగడను చాటుకుందాం!
04-07-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విశాలభారతి పాఠశాలలో ఘనంగా వనమహోత్సవం

మొక్కలు నాటిన కౌన్సిలర్ పాక చిరంజీవి, కరస్పాండెంట్ చైతన్య క్రాంతి వర్ధన్ రెడ్డి

ప్రకృతిని కాపాడితేనే మానవ మనుగడ సాధ్యమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి పిలుపునిచ్చారు. శనివారం చౌటుప్పల్ కేంద్రంలోని ‘విశాలభారతి హైస్కూల్’లో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, పాఠశాల కరస్పాండెంట్ వీసం చైతన్య క్రాంతి వర్ధన్ రెడ్డితో కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ చిరంజీవి మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థి దశ నుంచే మొక్కల పెంపకంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పాఠశాల కరస్పాండెంట్ చైతన్య క్రాంతి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. తమ పాఠశాల తరఫున పర్యావరణ హిత కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ అశోక్ కుమార్, ప్రధానోపాధ్యాయులు ముత్యం శ్రీనివాస్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రకృతిని కాపాడుకుందాం.. మనుగడను చాటుకుందాం!

Article Image

విశాలభారతి పాఠశాలలో ఘనంగా వనమహోత్సవం

మొక్కలు నాటిన కౌన్సిలర్ పాక చిరంజీవి, కరస్పాండెంట్ చైతన్య క్రాంతి వర్ధన్ రెడ్డి

ప్రకృతిని కాపాడితేనే మానవ మనుగడ సాధ్యమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి పిలుపునిచ్చారు. శనివారం చౌటుప్పల్ కేంద్రంలోని ‘విశాలభారతి హైస్కూల్’లో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, పాఠశాల కరస్పాండెంట్ వీసం చైతన్య క్రాంతి వర్ధన్ రెడ్డితో కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ చిరంజీవి మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థి దశ నుంచే మొక్కల పెంపకంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పాఠశాల కరస్పాండెంట్ చైతన్య క్రాంతి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. తమ పాఠశాల తరఫున పర్యావరణ హిత కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ అశోక్ కుమార్, ప్రధానోపాధ్యాయులు ముత్యం శ్రీనివాస్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News