దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళి
దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళి
Editor Desk
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం నల్గొండలోని దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య త్యాగం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు. నైజాం పాలన, రజాకారులు, దొరల అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలను ఉద్యమబాట పట్టించిన మహనీయుడిగా ఆయనను కొనియాడారు.
వెట్టి చాకిరి, దోపిడీ, సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి అతి చిన్న వయసులోనే అమరుడైన దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగిస్తూ విద్యార్థి, యువజన, ప్రజా సమస్యల పరిష్కారం కోసం డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తాయని తెలిపారు.
కార్యక్రమంలో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు గుండాల నరేష్, మారుపాక కిరణ్, ఎండీ అదిల్, కార్లపూడి రాము, గోపిచందు, బాలరాజు, రోహిత్, ముకేశ్, సాయి, హరీష్, మాధవ్ యాదగిరి, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి