నాగారం:తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిపిఎం పార్టీ నాగారం మండల కార్యదర్శి దేవరకొండ యాదగిరి అన్నారు. శనివారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నాగారం మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
నిజాం నిరంకుశ పాలన, భూస్వాముల దోపిడీ, వెట్టిచాకిరి, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం సాగించిన చారిత్రాత్మక పోరాటంలో దొడ్డి కొమురయ్య తన ప్రాణాలను అర్పించి అమరుడయ్యారని అన్నారు.ఆయన త్యాగం తెలంగాణ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చి వేలాది మంది ప్రజలను ఉద్యమ బాట పట్టించిందని గుర్తు చేశారు.
దొడ్డి కొమురయ్య కలలుగన్న సమానత్వ సమాజ నిర్మాణం కోసం ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జూలై 4 నుండి 25 వరకు మండలంలోని దళితవాడలు, గిరిజన తండాలలో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించి, గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం అధికారులకు వినతిపత్రాలు అందజేయడంతో పాటు అవసరమైతే ప్రజా ఉద్యమాలు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కడెం కుమార్, గుడిపురి వెంకటేశ్వర్లు, వెంకన్న, శ్రీధర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి