Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి ఆధార్ పార్టీ; పార్టీ వ్యవస్థాపకులు ఈడ శేషగిరి రావు గౌడ్ నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 05, 2026 10:54 PM

అమరజీవి దొడ్డి కొమురయ్య ఆశయాల సాధనకు కృషి చేయాలి; సిపిఎం మండల కార్యదర్శి దేవరకొండ యాదగిరి

అమరజీవి దొడ్డి కొమురయ్య ఆశయాల సాధనకు కృషి చేయాలి; సిపిఎం మండల కార్యదర్శి దేవరకొండ యాదగిరి

అమరజీవి దొడ్డి కొమురయ్య ఆశయాల సాధనకు కృషి చేయాలి;  సిపిఎం మండల కార్యదర్శి దేవరకొండ యాదగిరి
July 04, 2026 07:03 PM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

నాగారం:తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిపిఎం పార్టీ నాగారం మండల కార్యదర్శి దేవరకొండ యాదగిరి అన్నారు. శనివారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నాగారం మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

నిజాం నిరంకుశ పాలన, భూస్వాముల దోపిడీ, వెట్టిచాకిరి, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం సాగించిన చారిత్రాత్మక పోరాటంలో దొడ్డి కొమురయ్య తన ప్రాణాలను అర్పించి అమరుడయ్యారని అన్నారు.ఆయన త్యాగం తెలంగాణ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చి వేలాది మంది ప్రజలను ఉద్యమ బాట పట్టించిందని గుర్తు చేశారు.

దొడ్డి కొమురయ్య కలలుగన్న సమానత్వ సమాజ నిర్మాణం కోసం ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా జూలై 4 నుండి 25 వరకు మండలంలోని దళితవాడలు, గిరిజన తండాలలో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించి, గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం అధికారులకు వినతిపత్రాలు అందజేయడంతో పాటు అవసరమైతే ప్రజా ఉద్యమాలు చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కడెం కుమార్, గుడిపురి వెంకటేశ్వర్లు, వెంకన్న, శ్రీధర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News