Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:22 AM

అమరజీవి దొడ్డి కొమురయ్య ఆశయాల సాధనకు కృషి చేయాలి; సిపిఎం మండల కార్యదర్శి దేవరకొండ యాదగిరి

అమరజీవి దొడ్డి కొమురయ్య ఆశయాల సాధనకు కృషి చేయాలి; సిపిఎం మండల కార్యదర్శి దేవరకొండ యాదగిరి

అమరజీవి దొడ్డి కొమురయ్య ఆశయాల సాధనకు కృషి చేయాలి;  సిపిఎం మండల కార్యదర్శి దేవరకొండ యాదగిరి
04-07-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

నాగారం:తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిపిఎం పార్టీ నాగారం మండల కార్యదర్శి దేవరకొండ యాదగిరి అన్నారు. శనివారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నాగారం మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

నిజాం నిరంకుశ పాలన, భూస్వాముల దోపిడీ, వెట్టిచాకిరి, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం సాగించిన చారిత్రాత్మక పోరాటంలో దొడ్డి కొమురయ్య తన ప్రాణాలను అర్పించి అమరుడయ్యారని అన్నారు.ఆయన త్యాగం తెలంగాణ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చి వేలాది మంది ప్రజలను ఉద్యమ బాట పట్టించిందని గుర్తు చేశారు.

దొడ్డి కొమురయ్య కలలుగన్న సమానత్వ సమాజ నిర్మాణం కోసం ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా జూలై 4 నుండి 25 వరకు మండలంలోని దళితవాడలు, గిరిజన తండాలలో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించి, గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం అధికారులకు వినతిపత్రాలు అందజేయడంతో పాటు అవసరమైతే ప్రజా ఉద్యమాలు చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కడెం కుమార్, గుడిపురి వెంకటేశ్వర్లు, వెంకన్న, శ్రీధర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అమరజీవి దొడ్డి కొమురయ్య ఆశయాల సాధనకు కృషి చేయాలి; సిపిఎం మండల కార్యదర్శి దేవరకొండ యాదగిరి

Article Image

నాగారం:తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిపిఎం పార్టీ నాగారం మండల కార్యదర్శి దేవరకొండ యాదగిరి అన్నారు. శనివారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నాగారం మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

నిజాం నిరంకుశ పాలన, భూస్వాముల దోపిడీ, వెట్టిచాకిరి, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం సాగించిన చారిత్రాత్మక పోరాటంలో దొడ్డి కొమురయ్య తన ప్రాణాలను అర్పించి అమరుడయ్యారని అన్నారు.ఆయన త్యాగం తెలంగాణ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చి వేలాది మంది ప్రజలను ఉద్యమ బాట పట్టించిందని గుర్తు చేశారు.

దొడ్డి కొమురయ్య కలలుగన్న సమానత్వ సమాజ నిర్మాణం కోసం ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా జూలై 4 నుండి 25 వరకు మండలంలోని దళితవాడలు, గిరిజన తండాలలో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించి, గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం అధికారులకు వినతిపత్రాలు అందజేయడంతో పాటు అవసరమైతే ప్రజా ఉద్యమాలు చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కడెం కుమార్, గుడిపురి వెంకటేశ్వర్లు, వెంకన్న, శ్రీధర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News