గడ్కోల్ లో దొడ్డి కొమురయ్య కు ఘన నివాళులు
గడ్కోల్ లో దొడ్డి కొమురయ్య కు ఘన నివాళులు
Reporter shekar
సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ, వర్ధంతి ని ఘనంగా జరుపుకున్నారు.
ఈసందర్బంగా సిపిఐ( ఎం. ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ మాట్లాడుతు:బానిసత్వం భూమి కోసం, భుక్తి కోసం, సాగిన తెలంగాణ సాయుధరైతంగా పోరాటంలో కామ్రేడు దొడ్డి కొమరయ్య ముందు భాగంలో నిలిచి పోరాడిన వీర యోధుడన్నారు. 4వేల మంది అమరులు అయ్యారని, 3వేల గ్రామాలు విముక్తి అయ్యాయని, 10లక్షల ఎకరాలను పంచిన గొప్ప కమ్యూనిస్ట్ ఉద్యమం లో కామ్రేడ్ దొడ్డి కొమరయ్య ముందు భాగంలో నిలిచాడని, కామ్రేడ్ దొడ్డికొమరయ్య అమరత్వం స్ఫూర్తితో సాయుధారైతంగా పోరాటం మరింత ఉదృతం అయిందని అన్నారు.అయన స్ఫూర్తిని చాటడమంటే బలమైన పోరాటాలను చేపట్టి, ఉద్యమాలను నిర్మించడమేనన్నారు.ఈ కార్యక్రమం లో
డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, ఎం సాయరెడ్డి, బి బాబన్న, బి కిశోర్, ఎం అనీష్, మండల నాయకులు ఎస్ కిశోర్, జి బాల్ రెడ్డి, జి ఎర్రన్న, ఒ ఆశన్న తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి