దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్రావు.
దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్రావు.
Editor Desk
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు పిలుపునిచ్చారు.
శనివారం జిల్లా సమీకృత కలెక్టరేట్లో దొడ్డి కొమురయ్య 81వ వర్ధంతి సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి కలిసి దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా భాస్కర్రావు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ పోరాటంలో అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన దొడ్డి కొమురయ్య ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని అన్నారు. ఆయన అడుగుజాడల్లో పనిచేసే అవకాశం లభించడం గర్వకారణమని పేర్కొన్నారు.రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి మాట్లాడుతూ యువత దొడ్డి కొమురయ్య జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, బీసీ సంక్షేమ అధికారి సుబ్బారెడ్డి, కుల సంఘాల నాయకులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి