Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:49 AM

దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు.

దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు.

దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు.
04-07-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు పిలుపునిచ్చారు.

శనివారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో దొడ్డి కొమురయ్య 81వ వర్ధంతి సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి కలిసి దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా భాస్కర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ పోరాటంలో అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన దొడ్డి కొమురయ్య ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని అన్నారు. ఆయన అడుగుజాడల్లో పనిచేసే అవకాశం లభించడం గర్వకారణమని పేర్కొన్నారు.రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి మాట్లాడుతూ యువత దొడ్డి కొమురయ్య జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.

కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, బీసీ సంక్షేమ అధికారి సుబ్బారెడ్డి, కుల సంఘాల నాయకులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు.

Article Image

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు పిలుపునిచ్చారు.

శనివారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో దొడ్డి కొమురయ్య 81వ వర్ధంతి సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి కలిసి దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా భాస్కర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ పోరాటంలో అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన దొడ్డి కొమురయ్య ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని అన్నారు. ఆయన అడుగుజాడల్లో పనిచేసే అవకాశం లభించడం గర్వకారణమని పేర్కొన్నారు.రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి మాట్లాడుతూ యువత దొడ్డి కొమురయ్య జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.

కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, బీసీ సంక్షేమ అధికారి సుబ్బారెడ్డి, కుల సంఘాల నాయకులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News