ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి: తపస్
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి: తపస్
Editor Desk
ఇబ్రహీంపట్నం: ఉపాధ్యాయులు, విద్యారంగానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పూజరి రమేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తపస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శనివారం ఇబ్రహీంపట్నం మండల శాఖ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, ఈ-కుబేర్లో పెండింగ్లో ఉన్న బిల్లులకు నిధుల మంజూరు, పెన్షనర్ల బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు, కేజీబీవీ, మోడల్, గురుకుల, ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, పాఠశాలలకు మౌలిక వసతుల కోసం ప్రత్యేక గ్రాంట్లు విడుదల చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షుడు వడ్ల రాజేందర్, మండల ప్రధాన కార్యదర్శి రాపోలు ప్రవీణ్ కుమార్, జిల్లా కార్యదర్శి పట్నం కృష్ణ, మహిళ కో-కన్వీనర్ సంజీవరాణి, కోశాధికారి రాము, మీడియా కన్వీనర్ పొట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి