PRINT TIME: July 04, 2026 08:44 PM
రైతులకు ఉచిత పత్తి విత్తనాలు పంపిణీ
రైతులకు ఉచిత పత్తి విత్తనాలు పంపిణీ
July 04, 2026 07:04 PM
13 Views
స్థానికం ప్రతినిధి :
వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh
వలిగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో పత్తి ఉత్పత్తి ఉత్పాదకతను పెంచే కార్యక్రమంలో భాగంగా ‘పత్తి ఉత్పాదకత మిషన్' పథకం కింద రైతులకు 100 శాతం సబ్సిడీతో పత్తి విత్తనాలను శనివారం పంపిణీ చేశారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులకు 225 ఎకరాలకు కావాల్సిన పత్తి విత్తనాలు రైతులకు అందజేశారు. రైతులకు సాగు వ్యయం తగ్గించి, అధిక దిగుబడి సాధించేలా నాణ్యమైన పత్తి విత్తనాలను ప్రభుత్వం అందించిందని మండల వ్యవసాయ అధికారిణి అంజనీ దేవి పేర్కొన్నారు. ఈ విత్తనాలను ఇంతకు ముందు వేసిన పంట సాళ్ల మధ్యలో వేయకూడదని, వీటిని ప్రత్యేకంగా ఒక ఎకరం పొలంలో వేయాలని, మందులు, ఎరువులు కూడా ప్రత్యేకంగా వినియోగించాలని . ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసయ్య గూడెం సర్పంచ్ పసల జ్యోతి, మంగ జగన్ ఏఈఓలు , రైతులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి