ఆనందంగా నేర్చుకుంటూ భవిష్యత్తుకు సిద్ధమయ్యే విద్య.. కిండర్బాట్స్ ప్రత్యేకత
ఆనందంగా నేర్చుకుంటూ భవిష్యత్తుకు సిద్ధమయ్యే విద్య.. కిండర్బాట్స్ ప్రత్యేకత
Krishna
సదాశివపేట పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన కిండర్బాట్స్ ఏఐ, రోబోటిక్స్ ప్రీ స్కూల్ను టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చిన్నారులకు ఆధునిక విద్య అందించే లక్ష్యంతో ఈ ప్రీ స్కూల్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. స్కూల్ డైరెక్టర్ సందీప్ మాట్లాడుతూ, 2 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ఏఐ, రోబోటిక్స్, ఎస్టీఈఎమ్ విద్య, ఆటల ద్వారా అభ్యాసం, ఆధునిక తరగతి గదులు, సురక్షితమైన వాతావరణంలో బోధన అందిస్తామని తెలిపారు. చిన్నారుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్యల పరిష్కార సామర్థ్యాలను పెంపొందించే ప్రత్యేక పాఠ్య ప్రణాళికను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్లే గ్రూప్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులకు ప్రవేశాలు ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్పర్సన్ రేణుక చిరు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి