Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:24 AM

గుడిలో దొంగతనం.. ఆటోతో సహా దొరికిపోయారు!

గుడిలో దొంగతనం.. ఆటోతో సహా దొరికిపోయారు!

గుడిలో దొంగతనం.. ఆటోతో సహా దొరికిపోయారు!
04-07-2026 171 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తూప్రాన్‌పేట రామాలయం చోరీ కేసు ఛేదించిన చౌటుప్పల్ పోలీసులు

ఇద్దరు నిందితుల రిమాండ్

భక్తిని ముసుగుగా మార్చుకుని రామాలయంలో చోరీకి తెగబడిన ఇద్దరు అంతర్జిల్లా దొంగలను చౌటుప్పల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. చౌటుప్పల్ సీఐ జి. మన్మధ కుమార్ శనివారం కేసు వివరాలను వెల్లడించారు. జూలై 2వ తేదీ తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో తూప్రాన్‌పేట గ్రామంలోని రామాలయంలో దొంగతనం జరిగింది. ఆలయ తాళాలు పగలగొట్టి నిందితులు చోరీకి పాల్పడ్డారు. మన్సూరాబాద్‌లోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో ఉంటున్న రింగు భిక్షం, రుద్రాక్ష ఎల్లయ్యలు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ చోరీకి పాల్పడ్డారు. రుద్రాక్ష ఎల్లయ్యకు చెందిన TS 05 UF 3648 నెంబర్ గల ఆటోలో వచ్చి దొంగతనం చేసి పారిపోయారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆటోను సీజ్ చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Sthanikam

గుడిలో దొంగతనం.. ఆటోతో సహా దొరికిపోయారు!

Article Image

తూప్రాన్‌పేట రామాలయం చోరీ కేసు ఛేదించిన చౌటుప్పల్ పోలీసులు

ఇద్దరు నిందితుల రిమాండ్

భక్తిని ముసుగుగా మార్చుకుని రామాలయంలో చోరీకి తెగబడిన ఇద్దరు అంతర్జిల్లా దొంగలను చౌటుప్పల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. చౌటుప్పల్ సీఐ జి. మన్మధ కుమార్ శనివారం కేసు వివరాలను వెల్లడించారు. జూలై 2వ తేదీ తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో తూప్రాన్‌పేట గ్రామంలోని రామాలయంలో దొంగతనం జరిగింది. ఆలయ తాళాలు పగలగొట్టి నిందితులు చోరీకి పాల్పడ్డారు. మన్సూరాబాద్‌లోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో ఉంటున్న రింగు భిక్షం, రుద్రాక్ష ఎల్లయ్యలు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ చోరీకి పాల్పడ్డారు. రుద్రాక్ష ఎల్లయ్యకు చెందిన TS 05 UF 3648 నెంబర్ గల ఆటోలో వచ్చి దొంగతనం చేసి పారిపోయారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆటోను సీజ్ చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News