గుడిలో దొంగతనం.. ఆటోతో సహా దొరికిపోయారు!
గుడిలో దొంగతనం.. ఆటోతో సహా దొరికిపోయారు!
K.RAVI
తూప్రాన్పేట రామాలయం చోరీ కేసు ఛేదించిన చౌటుప్పల్ పోలీసులు
ఇద్దరు నిందితుల రిమాండ్
భక్తిని ముసుగుగా మార్చుకుని రామాలయంలో చోరీకి తెగబడిన ఇద్దరు అంతర్జిల్లా దొంగలను చౌటుప్పల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. చౌటుప్పల్ సీఐ జి. మన్మధ కుమార్ శనివారం కేసు వివరాలను వెల్లడించారు. జూలై 2వ తేదీ తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో తూప్రాన్పేట గ్రామంలోని రామాలయంలో దొంగతనం జరిగింది. ఆలయ తాళాలు పగలగొట్టి నిందితులు చోరీకి పాల్పడ్డారు. మన్సూరాబాద్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్న రింగు భిక్షం, రుద్రాక్ష ఎల్లయ్యలు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ చోరీకి పాల్పడ్డారు. రుద్రాక్ష ఎల్లయ్యకు చెందిన TS 05 UF 3648 నెంబర్ గల ఆటోలో వచ్చి దొంగతనం చేసి పారిపోయారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆటోను సీజ్ చేసి, నిందితులను రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి