Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గ్లాసులు, పండ్లు పంపిణీ ఎస్ ఐ ఆర్ ప్రక్రియను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 04, 2026 10:31 PM

గుడిలో దొంగతనం.. ఆటోతో సహా దొరికిపోయారు!

గుడిలో దొంగతనం.. ఆటోతో సహా దొరికిపోయారు!

గుడిలో దొంగతనం.. ఆటోతో సహా దొరికిపోయారు!
July 04, 2026 08:18 PM 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తూప్రాన్‌పేట రామాలయం చోరీ కేసు ఛేదించిన చౌటుప్పల్ పోలీసులు

ఇద్దరు నిందితుల రిమాండ్

భక్తిని ముసుగుగా మార్చుకుని రామాలయంలో చోరీకి తెగబడిన ఇద్దరు అంతర్జిల్లా దొంగలను చౌటుప్పల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. చౌటుప్పల్ సీఐ జి. మన్మధ కుమార్ శనివారం కేసు వివరాలను వెల్లడించారు. జూలై 2వ తేదీ తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో తూప్రాన్‌పేట గ్రామంలోని రామాలయంలో దొంగతనం జరిగింది. ఆలయ తాళాలు పగలగొట్టి నిందితులు చోరీకి పాల్పడ్డారు. మన్సూరాబాద్‌లోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో ఉంటున్న రింగు భిక్షం, రుద్రాక్ష ఎల్లయ్యలు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ చోరీకి పాల్పడ్డారు. రుద్రాక్ష ఎల్లయ్యకు చెందిన TS 05 UF 3648 నెంబర్ గల ఆటోలో వచ్చి దొంగతనం చేసి పారిపోయారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆటోను సీజ్ చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News