కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం
కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం
Anjali
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న యలమర్తి మారెన్న కుమారుడు యలమర్తి మధు ఇంటర్మీడియట్ పరీక్షల్లో 966 మార్కులు సాధించి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచాడు. జిల్లాలో అత్యధిక మార్కులు సాధించడంతో మధును (స్టార్ బ్యాచ్ ప్రోగ్రాం) తారా బృంద కార్యక్రమానికి ఎంపిక చేశారు. అంతేకాకుండా ప్రముఖ విఐటి ఇంజనీరింగ్ కళాశాలలో పూర్తి ఉచితంగా చదువుకునే ప్రవేశం లభించింది. ఈ అరుదైన విజయం సాధించిన యలమర్తి మధును జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ శ్యాం ప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. ఇంజనీరింగ్ చదువుకు ఉపయోగపడేలా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ధ్రువపత్రాన్ని కలెక్టర్ స్వయంగా అందజేశారు. మధు సాధించిన ఘనత పట్ల బేడ బుడగ జంగం సామాజిక వర్గం, అతని తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం కార్యదర్శి సిరిశాల అంజి కలెక్టర్కు పుష్పగుచ్చం అందించి, పట్టు వస్త్రంతో సత్కరించారు.అనంతరం మధు తన కళాశాల ప్రధానాచార్యులు, ఉపాధ్యాయులను కలిసి మిఠాయిలు పంచిపెట్టి ఆశీస్సులు తీసుకున్నాడు. ఉపాధ్యాయులు కూడా మధును పట్టు వస్త్రంతో సత్కరించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని దీవించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి