Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 11:01 PM

ఎనిమిదేళ్లు గడిచినా చెరగని జ్ఞాపకాలు.. తండ్రికి ఘన నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు

ఎనిమిదేళ్లు గడిచినా చెరగని జ్ఞాపకాలు.. తండ్రికి ఘన నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు

ఎనిమిదేళ్లు గడిచినా చెరగని జ్ఞాపకాలు.. తండ్రికి ఘన నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు
10-06-2026 250 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నాగల్‌గిద్ద మండలంలోని ఔదత్‌పూర్ గ్రామంలో కీర్తిశేషులు ఎస్గి ఇరప్ప 8వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు సమాధి వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సమాధిని పూలమాలలతో అలంకరించి, క్యాండిళ్లు వెలిగించి, అగరబత్తులు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కుమారులు వై. బాబు, వై. పండరి, వై. ధనరాజ్, వై. మహేష్, వై. సురేష్‌తో పాటు కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్లు, మనుమలు, మనుమరాళ్లు మరియు బంధువులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వై. పండరి మాట్లాడుతూ, తమ తండ్రి మరణించి ఎనిమిది సంవత్సరాలు గడిచినా ఆయన ప్రేమ, ఆప్యాయత, విలువలు, మధుర జ్ఞాపకాలు ఇప్పటికీ కుటుంబ సభ్యుల హృదయాల్లో పదిలంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం కీర్తిశేషులు ఎస్గి ఇరప్ప చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు రాత్రంతా జాగరణ నిర్వహిస్తూ ఆయనతో గడిపిన మధుర క్షణాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని కీర్తిశేషులు ఎస్గి ఇరప్పకు ఘన నివాళులు అర్పించారు.

Sthanikam

ఎనిమిదేళ్లు గడిచినా చెరగని జ్ఞాపకాలు.. తండ్రికి ఘన నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు

Article Image

నాగల్‌గిద్ద మండలంలోని ఔదత్‌పూర్ గ్రామంలో కీర్తిశేషులు ఎస్గి ఇరప్ప 8వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు సమాధి వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సమాధిని పూలమాలలతో అలంకరించి, క్యాండిళ్లు వెలిగించి, అగరబత్తులు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కుమారులు వై. బాబు, వై. పండరి, వై. ధనరాజ్, వై. మహేష్, వై. సురేష్‌తో పాటు కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్లు, మనుమలు, మనుమరాళ్లు మరియు బంధువులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వై. పండరి మాట్లాడుతూ, తమ తండ్రి మరణించి ఎనిమిది సంవత్సరాలు గడిచినా ఆయన ప్రేమ, ఆప్యాయత, విలువలు, మధుర జ్ఞాపకాలు ఇప్పటికీ కుటుంబ సభ్యుల హృదయాల్లో పదిలంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం కీర్తిశేషులు ఎస్గి ఇరప్ప చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు రాత్రంతా జాగరణ నిర్వహిస్తూ ఆయనతో గడిపిన మధుర క్షణాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని కీర్తిశేషులు ఎస్గి ఇరప్పకు ఘన నివాళులు అర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News