ఎనిమిదేళ్లు గడిచినా చెరగని జ్ఞాపకాలు.. తండ్రికి ఘన నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు
ఎనిమిదేళ్లు గడిచినా చెరగని జ్ఞాపకాలు.. తండ్రికి ఘన నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు
Krishna
నాగల్గిద్ద మండలంలోని ఔదత్పూర్ గ్రామంలో కీర్తిశేషులు ఎస్గి ఇరప్ప 8వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు సమాధి వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సమాధిని పూలమాలలతో అలంకరించి, క్యాండిళ్లు వెలిగించి, అగరబత్తులు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కుమారులు వై. బాబు, వై. పండరి, వై. ధనరాజ్, వై. మహేష్, వై. సురేష్తో పాటు కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్లు, మనుమలు, మనుమరాళ్లు మరియు బంధువులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వై. పండరి మాట్లాడుతూ, తమ తండ్రి మరణించి ఎనిమిది సంవత్సరాలు గడిచినా ఆయన ప్రేమ, ఆప్యాయత, విలువలు, మధుర జ్ఞాపకాలు ఇప్పటికీ కుటుంబ సభ్యుల హృదయాల్లో పదిలంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం కీర్తిశేషులు ఎస్గి ఇరప్ప చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు రాత్రంతా జాగరణ నిర్వహిస్తూ ఆయనతో గడిపిన మధుర క్షణాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని కీర్తిశేషులు ఎస్గి ఇరప్పకు ఘన నివాళులు అర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి