Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:21 AM

వైన్స్ ముందు బైక్‌లో రూ.50 వేల నగదు, ఎస్‌బీఐ చెక్కులు మాయం

వైన్స్ ముందు బైక్‌లో రూ.50 వేల నగదు, ఎస్‌బీఐ చెక్కులు మాయం

వైన్స్ ముందు బైక్‌లో రూ.50 వేల నగదు, ఎస్‌బీఐ చెక్కులు మాయం
11-06-2026 431 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసి వచ్చిన రైతుకు షాక్.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు


చిట్యాల, నల్గొండ జిల్లా:

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని ఉరుమోడ్ల రోడ్డులో ఉన్న వైన్స్ షాప్ ముందు నిలిపిన బైక్‌లో నుంచి రూ.50 వేల నగదు, రెండు

ఎస్‌బీఐ చెక్కులు అపహరణకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం, పిట్టంపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు స్థానిక ఎస్‌బీఐ బ్యాంకు నుంచి వడ్ల విక్రయానికి సంబంధించిన డబ్బును డ్రా చేసుకుని బైక్‌పై చిట్యాలకు వచ్చాడు. అనంతరం ఉరుమోడ్ల రోడ్డులోని వైన్స్ షాప్ వద్ద బైక్‌ను నిలిపి మద్యం కొనుగోలు చేసేందుకు లోపలికి వెళ్లాడు.

కొద్ది సేపటి తర్వాత బయటకు వచ్చి చూసేసరికి బైక్‌లో ఉంచిన రూ.50 వేల నగదు, రెండు ఎస్‌బీఐ చెక్కులు కనిపించలేదు. స్థానికుల సమాచారం మేరకు, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి నగదు, చెక్కులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.

బాధిత రైతు ఫిర్యాదు మేరకు చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

వైన్స్ ముందు బైక్‌లో రూ.50 వేల నగదు, ఎస్‌బీఐ చెక్కులు మాయం

Article Image

బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసి వచ్చిన రైతుకు షాక్.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు


చిట్యాల, నల్గొండ జిల్లా:

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని ఉరుమోడ్ల రోడ్డులో ఉన్న వైన్స్ షాప్ ముందు నిలిపిన బైక్‌లో నుంచి రూ.50 వేల నగదు, రెండు

ఎస్‌బీఐ చెక్కులు అపహరణకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం, పిట్టంపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు స్థానిక ఎస్‌బీఐ బ్యాంకు నుంచి వడ్ల విక్రయానికి సంబంధించిన డబ్బును డ్రా చేసుకుని బైక్‌పై చిట్యాలకు వచ్చాడు. అనంతరం ఉరుమోడ్ల రోడ్డులోని వైన్స్ షాప్ వద్ద బైక్‌ను నిలిపి మద్యం కొనుగోలు చేసేందుకు లోపలికి వెళ్లాడు.

కొద్ది సేపటి తర్వాత బయటకు వచ్చి చూసేసరికి బైక్‌లో ఉంచిన రూ.50 వేల నగదు, రెండు ఎస్‌బీఐ చెక్కులు కనిపించలేదు. స్థానికుల సమాచారం మేరకు, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి నగదు, చెక్కులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.

బాధిత రైతు ఫిర్యాదు మేరకు చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News