చౌటుప్పల్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా నందగిరి వెంకటేశం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ రహదారిపై రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ నిర్వహణను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటామని, ట్రాఫిక్ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. రెడ్డిబావి గ్రామానికి చెందిన వెంకటేశం ఇక్కడ బాధ్యతలు చేపట్టడం పట్ల స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి