రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్
రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని రైతులందరికీ తెలియజేయునది ఏమనగా, రానున్న ఖరీఫ్ సీజన్కు అవసరమైన విత్తన వేరుశెనగ పంపిణీ కార్యక్రమంలో భాగంగా రేపటి నుండి సంబంధిత రైతు సేవా కేంద్రాలు (RSKs)లో రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చును.
వేరుశెనగ విత్తనాలు పొందదలచిన రైతులు తమ సమీప రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవలసిందిగా కోరడమైనది. జిల్లాలో విత్తన వేరుశెనగ పంపిణీ త్వరలో ప్రారంభం కానుండగా, రైతులు ముందస్తుగా నమోదు చేసుకోవడం ద్వారా పంపిణీ కార్యక్రమం సజావుగా నిర్వహించుటకు సహకరించగలరని అధికారులు తెలిపారు.
ప్రభుత్వం 40% రాయితీతో విత్తన వేరుశెనగ పంపిణీ చేయనుండగా, రైతు వాటా క్రింది విధంగా నిర్ణయించబడింది:
• K-6 మరియు TCGS-1694 రకాలకు 30 కేజీల బస్తా ధర రూ. 1836
• KL-1812 రకానికి 30 కేజీల బస్తా ధర రూ. 1710
విత్తన వేరుశెనగ కావలసిన రైతులు పట్టా పాసు పుస్తకం, ఆధార్ కార్డు మరియు మొబైల్ ఫోన్తో సంబంధిత రైతు సేవా కేంద్రాలను సంప్రదించవలెనని సూచించారు.
మండలంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే నమోదు చేసుకోవలసిందిగా మండల వ్యవసాయ అధికారి శ్రీ AP సంజీవ్ కుమార్ గారు విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి