Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజల భద్రతే లక్ష్యం.. ఎన్‌హెచ్-65 పనులను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 05, 2026 05:38 PM

రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్

రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్

రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్
June 05, 2026 02:24 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని రైతులందరికీ తెలియజేయునది ఏమనగా, రానున్న ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన విత్తన వేరుశెనగ పంపిణీ కార్యక్రమంలో భాగంగా రేపటి నుండి సంబంధిత రైతు సేవా కేంద్రాలు (RSKs)లో రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చును.


వేరుశెనగ విత్తనాలు పొందదలచిన రైతులు తమ సమీప రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవలసిందిగా కోరడమైనది. జిల్లాలో విత్తన వేరుశెనగ పంపిణీ త్వరలో ప్రారంభం కానుండగా, రైతులు ముందస్తుగా నమోదు చేసుకోవడం ద్వారా పంపిణీ కార్యక్రమం సజావుగా నిర్వహించుటకు సహకరించగలరని అధికారులు తెలిపారు.


ప్రభుత్వం 40% రాయితీతో విత్తన వేరుశెనగ పంపిణీ చేయనుండగా, రైతు వాటా క్రింది విధంగా నిర్ణయించబడింది:


• K-6 మరియు TCGS-1694 రకాలకు 30 కేజీల బస్తా ధర రూ. 1836

• KL-1812 రకానికి 30 కేజీల బస్తా ధర రూ. 1710


విత్తన వేరుశెనగ కావలసిన రైతులు పట్టా పాసు పుస్తకం, ఆధార్ కార్డు మరియు మొబైల్ ఫోన్‌తో సంబంధిత రైతు సేవా కేంద్రాలను సంప్రదించవలెనని సూచించారు.


మండలంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే నమోదు చేసుకోవలసిందిగా మండల వ్యవసాయ అధికారి శ్రీ AP సంజీవ్ కుమార్ గారు విజ్ఞప్తి చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News