Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రోన్‌తో జెండా ఎగరవేసిన జెట్టి శివప్రసాద్ వివేకానంద పాఠశాల 10వ వార్షికోత్సవం ఘనంగా అలరించిన చిన్నారుల నృత్యాలు – గురువులే విద్యార్థుల భవితకు మార్గదర్శకులు అంబేడ్కర్: పుస్తకాలలో కాదు, ప్రస్తుత సమాజంలో పునర్జన్మ పొందాల్సిన ఆలోచన” హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 14, 2026 11:53 PM

వివేకానంద పాఠశాల 10వ వార్షికోత్సవం ఘనంగా అలరించిన చిన్నారుల నృత్యాలు – గురువులే విద్యార్థుల భవితకు మార్గదర్శకులు

వివేకానంద పాఠశాల 10వ వార్షికోత్సవం ఘనంగా అలరించిన చిన్నారుల నృత్యాలు – గురువులే విద్యార్థుల భవితకు మార్గదర్శకులు

వివేకానంద పాఠశాల 10వ వార్షికోత్సవం ఘనంగా అలరించిన చిన్నారుల నృత్యాలు – గురువులే విద్యార్థుల భవితకు మార్గదర్శకులు
April 14, 2026 07:55 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి:

స్థానిక మార్కెట్ రోడ్డులోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మంగళవారం 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

కార్యక్రమంలో పాఠశాల హెడ్‌మిస్ట్రెస్ వనజావాణి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థికి మొదటి గురువు తల్లి అయితే, రెండవ గురువు ఉపాధ్యాయులని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు.

ఈ సందర్భంగా వక్త జెక్క చంద్రా మాట్లాడుతూ, ఈ పాఠశాలలో చదివిన అనేక మంది విద్యార్థులు నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారని పేర్కొన్నారు.

గ్రామ పెద్దలు, ఇతర వక్తలు మాట్లాడుతూ, ఈ పాఠశాల విద్యార్థులు క్రమశిక్షణకు ప్రతీకలని, గురువులు నేర్పిన విలువలను జీవితంలో పాటించి ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి, గురువుల శ్రమకు తగిన ఫలితాలు సాధించాలని విద్యార్థులను ప్రోత్సహించారు.

అనంతరం గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రవీంద్ర, తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News