Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీరామ నామస్మరణతో కలశ వందనం.. కనకదుర్గ ఆలయంలో భక్తులకు పిలుపు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 28, 2026 08:03 PM

వివేకానంద పాఠశాల 10వ వార్షికోత్సవం ఘనంగా అలరించిన చిన్నారుల నృత్యాలు – గురువులే విద్యార్థుల భవితకు మార్గదర్శకులు

వివేకానంద పాఠశాల 10వ వార్షికోత్సవం ఘనంగా అలరించిన చిన్నారుల నృత్యాలు – గురువులే విద్యార్థుల భవితకు మార్గదర్శకులు

వివేకానంద పాఠశాల 10వ వార్షికోత్సవం ఘనంగా అలరించిన చిన్నారుల నృత్యాలు – గురువులే విద్యార్థుల భవితకు మార్గదర్శకులు
April 14, 2026 07:55 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి:

స్థానిక మార్కెట్ రోడ్డులోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మంగళవారం 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

కార్యక్రమంలో పాఠశాల హెడ్‌మిస్ట్రెస్ వనజావాణి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థికి మొదటి గురువు తల్లి అయితే, రెండవ గురువు ఉపాధ్యాయులని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు.

ఈ సందర్భంగా వక్త జెక్క చంద్రా మాట్లాడుతూ, ఈ పాఠశాలలో చదివిన అనేక మంది విద్యార్థులు నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారని పేర్కొన్నారు.

గ్రామ పెద్దలు, ఇతర వక్తలు మాట్లాడుతూ, ఈ పాఠశాల విద్యార్థులు క్రమశిక్షణకు ప్రతీకలని, గురువులు నేర్పిన విలువలను జీవితంలో పాటించి ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి, గురువుల శ్రమకు తగిన ఫలితాలు సాధించాలని విద్యార్థులను ప్రోత్సహించారు.

అనంతరం గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రవీంద్ర, తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News