Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భారతదేశంలో అత్యంత విశ్వసనీయ ఐ వి ఎఫ్ స్పెషలిస్ట్‌గా డాక్టర్ ఈ. ప్రశాంతి రెడ్డికి జాతీయ అవార్డు రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 28, 2026 12:48 AM

పెనుకొండలో బీసీ విద్యార్థులకు వరం.. కొత్తగా 3 హాస్టళ్లు మంజూరు

పెనుకొండలో బీసీ విద్యార్థులకు వరం.. కొత్తగా 3 హాస్టళ్లు మంజూరు

పెనుకొండలో బీసీ విద్యార్థులకు వరం.. కొత్తగా 3 హాస్టళ్లు మంజూరు
May 08, 2026 08:35 PM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ నియోజకవర్గంలోని బీసీ విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిగి, రొద్దం, సోమందేపల్లిలో కొత్తగా మూడు బీసీ హాస్టళ్లు మంజూరు చేసింది. వీటిలో పరిగి, రొద్దంలో బాలికల హాస్టళ్లు, సోమందేపల్లిలో బాలుర హాస్టల్ ఏర్పాటు కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచే హాస్టళ్లు ప్రారంభం కానుండగా, విద్యార్థుల చేరికల కోసం జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు.


ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాలో 61 బీసీ హాస్టళ్లు ఉండగా, కొత్తగా మంజూరైన మూడు హాస్టళ్లతో సంఖ్య 64కు చేరనుంది. పెనుకొండ నియోజకవర్గంలో ఇప్పటికే ఉన్న నాలుగు హాస్టళ్లకు ఇవి తోడవడంతో గ్రామీణ, పేద, వలస కూలీల పిల్లలకు విద్యా అవకాశాలు మరింత విస్తరించనున్నాయి.


కొత్త హాస్టళ్ల నిర్వహణ కోసం హెచ్‌డబ్ల్యూఓలు (వార్డెన్లు) నియామక ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. సిబ్బంది కొరత నేపథ్యంలో ఇతర శాఖల ఉద్యోగులను డిప్యూటేషన్‌పై నియమించే అంశంపై జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపారు. త్వరలోనే కమిటీ ఏర్పాటు చేసి నియామకాలు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.


ఈ హాస్టళ్ల మంజూరులో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక పాత్ర పోషించారు. పేదరికం కారణంగా బీసీ విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి విషయం తీసుకెళ్లి హాస్టళ్లకు ఆమోదం పొందారు. విద్యార్థుల చేరికల కోసం గ్రామస్థాయిలో తల్లిదండ్రులతో మాట్లాడి అవగాహన కల్పించాలని విద్యాశాఖ అధికారులకు సూచనలు జారీ అయ్యాయి.


“బీసీ బిడ్డలకు ఉన్నత విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం” అని మంత్రి సవిత తెలిపారు. హాస్టళ్లు, గురుకులాల్లో సన్నబియ్యం భోజనం, ఆర్వో తాగునీరు, దోమతెరలు, పారిశుధ్య సిబ్బంది, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి బీసీ విద్యార్థి చదువులో ముందుకు రావాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టళ్లలో చేర్పించాలని ఆమె కోరారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News