శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని స్నేహలత నగర్, చల్లపల్లి గ్రామాల్లో కిశోరి వికాసం వేసవి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. CDPO డాక్టర్ శాంత లక్ష్మి ఆదేశాల మేరకు సూపర్వైజర్ సుభారాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ శిక్షణలో జీవన నైపుణ్యాలు, స్వీయ అవగాహనపై బాలికలకు మార్గదర్శనం అందించారు. తమ బలాలు, బలహీనతలు గుర్తించుకునేలా చేసి ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమం సాగింది. అలాగే ఆరోగ్యం, పరిశుభ్రత, బాల్యవివాహాలపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో CDPO డాక్టర్ శాంత లక్ష్మి, సూపర్వైజర్ సుభారాణి, కిశోరి బాలికలు, బాలురు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి