Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
300 మీటర్ల జాతీయ జెండాతో తైక్వాండో క్రీడాకారుల తిరంగా ర్యాలీ విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 16, 2026 07:51 AM

ఎంజేపీ గురుకులాల్లో 96.02% రిజల్ట్ – బీసీ విద్యార్థుల ప్రతిభ

ఎంజేపీ గురుకులాల్లో 96.02% రిజల్ట్ – బీసీ విద్యార్థుల ప్రతిభ

ఎంజేపీ గురుకులాల్లో 96.02% రిజల్ట్ – బీసీ విద్యార్థుల ప్రతిభ
30-04-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

రాష్ట్రంలో విడుదలైన పదో తరగతి ఫలితాల్లో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలు (ఎంజేపీ) అద్భుత ప్రతిభ కనబరిచాయి. 96.02% ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచాయి. రాష్ట్ర సగటు 85.25%తో పోలిస్తే దాదాపు 10% అధికంగా ఫలితాలు నమోదు చేయడం విశేషం.


ఈ ఏడాది 100 గురుకుల పాఠశాలల్లో 32 పాఠశాలలు 100% ఫలితాలు సాధించాయి. మొత్తం 5,501 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 5,274 మంది ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థుల సంఖ్యాపరంగా ఎంజేపీ గురుకులాలు అగ్రస్థానంలో నిలిచాయి.


ఇటీవల ఇంటర్ ఫలితాల్లోనూ బీసీ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించగా, టెన్త్‌లోనూ అదే జోరు కొనసాగించారు. బీసీ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు కూడా 85.99% ఉత్తీర్ణతతో ప్రతిభ చాటారు.


ఈ విజయంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. మంత్రి లోకేశ్ అమలు చేసిన వంద రోజుల ప్రణాళికల ఫలితంగానే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు.


అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఈ సందర్భంగా సంబరాలు నిర్వహించారు. అధికారులు, ఎంజేపీ ప్రతినిధులను మంత్రి అభినందించారు.


Sthanikam

ఎంజేపీ గురుకులాల్లో 96.02% రిజల్ట్ – బీసీ విద్యార్థుల ప్రతిభ

Article Image

రాష్ట్రంలో విడుదలైన పదో తరగతి ఫలితాల్లో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలు (ఎంజేపీ) అద్భుత ప్రతిభ కనబరిచాయి. 96.02% ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచాయి. రాష్ట్ర సగటు 85.25%తో పోలిస్తే దాదాపు 10% అధికంగా ఫలితాలు నమోదు చేయడం విశేషం.


ఈ ఏడాది 100 గురుకుల పాఠశాలల్లో 32 పాఠశాలలు 100% ఫలితాలు సాధించాయి. మొత్తం 5,501 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 5,274 మంది ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థుల సంఖ్యాపరంగా ఎంజేపీ గురుకులాలు అగ్రస్థానంలో నిలిచాయి.


ఇటీవల ఇంటర్ ఫలితాల్లోనూ బీసీ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించగా, టెన్త్‌లోనూ అదే జోరు కొనసాగించారు. బీసీ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు కూడా 85.99% ఉత్తీర్ణతతో ప్రతిభ చాటారు.


ఈ విజయంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. మంత్రి లోకేశ్ అమలు చేసిన వంద రోజుల ప్రణాళికల ఫలితంగానే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు.


అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఈ సందర్భంగా సంబరాలు నిర్వహించారు. అధికారులు, ఎంజేపీ ప్రతినిధులను మంత్రి అభినందించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News