ఎంజేపీ గురుకులాల్లో 96.02% రిజల్ట్ – బీసీ విద్యార్థుల ప్రతిభ
ఎంజేపీ గురుకులాల్లో 96.02% రిజల్ట్ – బీసీ విద్యార్థుల ప్రతిభ
EDIGA NAVEENKUMAR
రాష్ట్రంలో విడుదలైన పదో తరగతి ఫలితాల్లో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలు (ఎంజేపీ) అద్భుత ప్రతిభ కనబరిచాయి. 96.02% ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచాయి. రాష్ట్ర సగటు 85.25%తో పోలిస్తే దాదాపు 10% అధికంగా ఫలితాలు నమోదు చేయడం విశేషం.
ఈ ఏడాది 100 గురుకుల పాఠశాలల్లో 32 పాఠశాలలు 100% ఫలితాలు సాధించాయి. మొత్తం 5,501 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 5,274 మంది ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థుల సంఖ్యాపరంగా ఎంజేపీ గురుకులాలు అగ్రస్థానంలో నిలిచాయి.
ఇటీవల ఇంటర్ ఫలితాల్లోనూ బీసీ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించగా, టెన్త్లోనూ అదే జోరు కొనసాగించారు. బీసీ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు కూడా 85.99% ఉత్తీర్ణతతో ప్రతిభ చాటారు.
ఈ విజయంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. మంత్రి లోకేశ్ అమలు చేసిన వంద రోజుల ప్రణాళికల ఫలితంగానే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు.
అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఈ సందర్భంగా సంబరాలు నిర్వహించారు. అధికారులు, ఎంజేపీ ప్రతినిధులను మంత్రి అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి