రొద్దంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ
రొద్దంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని రొద్దం-2 రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ప్రకృతి వ్యవసాయం పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి రాజేష్ మాట్లాడుతూ, ఈ ఏడాది ఎల్-నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.
తక్కువ వర్షపాత పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ విధానాన్ని అనుసరించాలని సూచించారు. మండల మాస్టర్ ట్రైనర్ భార్గవ్, APCNF కు సంబంధించిన Half-Moon, ATM, Dr.PR, A-Grade వంటి సాగు నమూనాలను వివరించారు.
అలాగే రైతులు APAIM, e-Panta లో పంట వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా పీఎం కిసాన్ వంటి ప్రభుత్వ పథకాల లబ్ధి, సబ్సిడీల సమాచారం మొబైల్లోనే తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో AEO హంసవేణి, RSK సిబ్బంది నరసింహ మూర్తి, జాఫర్ తదితరులు, ICRPలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి