చౌటుప్పల్లో కోతుల బెడదకు చెక్!
చౌటుప్పల్లో కోతుల బెడదకు చెక్!
K.RAVI
మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో గత కొంతకాలంగా తీవ్రంగా ఉన్న కోతుల బెడద నివారణకు మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ప్రత్యేక చొరవతో ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి నుండి నిపుణుల బృందాన్ని రప్పించారు. శనివారం పట్టణంలోని విద్యానగర్, కచ్చీరు తదితర ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేసి సుమారు 211 కోతులను బంధించారు. చైర్పర్సన్ ఆదేశాల మేరకు పట్టుబడిన కోతులను ములుగు జిల్లాలోని మాటు కొండూరు అటవీ ప్రాంతానికి తరలించారు. పట్టణ ప్రజల రక్షణే తమ ప్రథమ ప్రాధాన్యతని, ఈ డ్రైవ్ మున్సిపాలిటీ అంతటా కొనసాగుతుందని చైర్పర్సన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాక చిరంజీవి, హన్ను మహమ్మద్, బద్రి గాలయ్య, చింతల ఉమామహేశ్వరి, నాయకులు చింతల సాయిలు, బత్తుల దాసు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని కోతుల బెడద నుండి ఉపశమనం కలిగించినందుకు పట్టణ ప్రజలు పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి