Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చట్టాలపై అవగాహనే రక్షణ కవచం..! సమస్యలు ఎదురైతే భయపడకుండా ఫిర్యాదు చేయాలి: జడ్జి వి. రత్నకుమారి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 18, 2026 06:23 PM

గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం.. ప్రజలకు సర్పంచ్ సాయికుమార్ గౌడ్ పిలుపు.

గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం.. ప్రజలకు సర్పంచ్ సాయికుమార్ గౌడ్ పిలుపు.

గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం.. ప్రజలకు సర్పంచ్ సాయికుమార్ గౌడ్ పిలుపు.
July 18, 2026 03:51 PM 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శనివారం బృహత్‌ శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. స్వామి వివేకానంద విగ్రహం వద్ద నుంచి పాత ఊరు వరకు రోడ్డుకు ఇరువైపులా గ్రామపంచాయతీ సిబ్బంది చీపుర్లతో శుభ్రం చేసి చెత్తాచెదారాన్ని తొలగించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ మాట్లాడుతూ.. "పరిశుభ్రమైన గ్రామమే ఆరోగ్యకరమైన గ్రామానికి నాంది" అని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు పరిశుభ్రతను తమ బాధ్యతగా భావించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఐదో వార్డు సభ్యురాలు నేరటి మానస సురేష్ యాదవ్, గ్రామపంచాయతీ కార్యదర్శి అక్కెనపల్లి సుధా, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News