PRINT TIME: July 18, 2026 06:23 PM
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం.. ప్రజలకు సర్పంచ్ సాయికుమార్ గౌడ్ పిలుపు.
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం.. ప్రజలకు సర్పంచ్ సాయికుమార్ గౌడ్ పిలుపు.
July 18, 2026 03:51 PM
41 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శనివారం బృహత్ శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. స్వామి వివేకానంద విగ్రహం వద్ద నుంచి పాత ఊరు వరకు రోడ్డుకు ఇరువైపులా గ్రామపంచాయతీ సిబ్బంది చీపుర్లతో శుభ్రం చేసి చెత్తాచెదారాన్ని తొలగించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ మాట్లాడుతూ.. "పరిశుభ్రమైన గ్రామమే ఆరోగ్యకరమైన గ్రామానికి నాంది" అని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు పరిశుభ్రతను తమ బాధ్యతగా భావించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఐదో వార్డు సభ్యురాలు నేరటి మానస సురేష్ యాదవ్, గ్రామపంచాయతీ కార్యదర్శి అక్కెనపల్లి సుధా, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి