13 ఏళ్ల వివాదానికి ఫుల్స్టాప్..! టూటౌన్ పోలీసుల చొరవతో స్వాతంత్ర్య సమరయోధుల భవనం ఖాళీ
13 ఏళ్ల వివాదానికి ఫుల్స్టాప్..! టూటౌన్ పోలీసుల చొరవతో స్వాతంత్ర్య సమరయోధుల భవనం ఖాళీ
Editor Desk
డీఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎస్ఐ సైదాబాబు.. కమిటీ సభ్యుల ప్రశంసలు
నల్లగొండ టౌన్: దశాబ్దానికి పైగా పరిష్కారం కాని అద్దె వివాదానికి టూటౌన్ పోలీసులు ముగింపు పలికారు. స్వాతంత్ర్య సమరయోధుల భవనంలో 2011 నుంచి అద్దెకు నివాసం ఉంటూ, చాలా కాలంగా అద్దె చెల్లించకుండా భవనాన్ని ఖాళీ చేయని వ్యక్తిని పోలీసులు చట్టబద్ధంగా కౌన్సెలింగ్ నిర్వహించి భవనాన్ని ఖాళీ చేయించారు.
పట్టణంలోని స్వాతంత్ర్య సమరయోధుల భవనంలో వెంకటరమణ అనే వ్యక్తి 2011 నుంచి నివాసం ఉంటున్నాడు. అయితే కొంతకాలంగా అద్దె చెల్లించకపోవడంతో పాటు భవనాన్ని ఖాళీ చేయకపోవడంతో యాజమాన్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. సమస్యను స్వాతంత్ర్య సమరయోధుల కమిటీ ప్రతినిధులు నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
డీఎస్పీ ఆదేశాల మేరకు టూటౌన్ ఎస్ఐ సైదాబాబు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అద్దెదారుడితో చట్టపరంగా చర్చించి, కౌన్సెలింగ్ నిర్వహించడంతో భవనాన్ని స్వచ్ఛందంగా ఖాళీ చేయించారు.
ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యను వేగంగా పరిష్కరించిన టూటౌన్ పోలీసుల పనితీరును స్వాతంత్ర్య సమరయోధుల కమిటీ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ చంద్రశేఖర్, ఏఎస్ఐ ఉమారాణి, కమిటీ ప్రతినిధి కొప్పు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి