ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు రక్షణ లేదా..? బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గెల్లు శ్రీనివాస్ యాదవ్
ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు రక్షణ లేదా..? బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గెల్లు శ్రీనివాస్ యాదవ్
Editor Desk
చైతన్యపురి, జూలై 18: యాదాద్రి దేవస్థానం పాలకమండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్పై యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు శివచరణ్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
చింతలకుంటలోని ఈశ్వరమ్మ యాదవ్ నివాసానికి వెళ్లిన రాజ్యసభ సభ్యుడు ఎం. అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆమెను పరామర్శించి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న మహిళా నాయకురాలిపై అవమానకర వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. మహిళలను గౌరవించాల్సిన బాధ్యత ఉన్న నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. బాధ్యుడిపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాధితురాలికి రక్షణ కల్పించకుండా, వివాదంలో ఉన్న నాయకుడికి భద్రత కల్పించడం బీసీలను అవమానించడమేనని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల వివక్షతో వ్యవహరిస్తోందని విమర్శించారు. రానున్న రోజుల్లో బహుజనులు తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రుద్రవరం సునీల్ కుమార్, పోకల ఎలిజబెత్తో పాటు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి